కీలక వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... నాలుగున్నర ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీరేట్లను...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... నాలుగున్నర ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీరేట్లను పావు శాతం పెంచుతూ ఆర్బీఐ... పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక పరపతి విధాన సమావేశం... ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆర్బీఐ నిర్ణయం ప్రకారం... ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. రివర్స్ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి. చివరి సారిగా జనవరి 2014లో రెపో రేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వస్తోంది.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT