‘రంగస్థలం’ టీజర్‌ వచ్చేసింది!

x
Highlights

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది. చెప్పిన టైమ్‌కు కరెక్ట్‌గా టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఖుషీ చేసింది...

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది. చెప్పిన టైమ్‌కు కరెక్ట్‌గా టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఖుషీ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌లో అందరు ఊహించినదానికంటే కూడా ఎక్కువ మాస్‌ గెటప్‌ రామ్‌ చరణ్‌ తేజ కనిపించారు. పక్కా పల్లెటూరి కుర్రాడిగా అదరగొట్టాడు. అదిరిపోయే డేస్‌ డ్రమ్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మొదలైన టీజర్‌లో తొలుత ఓ పాత బ్రిడ్జిపై లాంగ్‌ షాట్‌లో సైకిల్‌ తొక్కుతున్న రామ్‌చరణ్‌ కనిపించగా ఆ వెంటనే ఏపుగా పెరిగి ఎండిపోయిన రేలుగడ్డిలో దేన్నో వేటాడేందుకు పరిగెడుతున్నట్లుగా రామ్‌చరణ్‌ కనిపిస్తాడు.

ఆ వెంటనే ఓ ఆయిల్‌ ఇంజిన్‌ మోటర్‌ను స్టార్ట్‌ చేస్తూ 'నాపేరు చిట్టిబాబండి.. మా ఊరుకు నేనే ఇంజినీర్‌' అనే డైలాగ్‌తో టీజర్‌ మొదలవగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ బదిరుడా అని అనుమానం వచ్చేట్లుగా దర్శకుడు హింట్‌ ఇచ్చాడు. అందుకు తగినట్లుగా 'అందరికి సౌండ్‌ వినపడిద్దండి.. నాకు సౌండ్‌ కనపడుద్దండి' అనే డైలాగ్‌ కూడా రామ్‌ చరణ్‌ ఈ టీజర్‌లో చెప్పేశాడు. అనంతరం కత్తిపట్టుకొని ఆవేశంగా రామ్‌చరణ్‌ వస్తుండటాన్ని బట్టి మాస్‌ ప్రేక్షకులను ఈ సినిమా కట్టిపడేస్తుందేమో అని చెప్పకతప్పదేమో. మొత్తానికి టీజర్‌లో మాత్రం పాతకాలంనాటి ఓ పల్లెటూరును అందులోని ఓ మొరటు కుర్రాడిని అద్భుతంగా చూపించారనే చెప్పాలి. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories