అధ్యక్షుడిగా తొలి ప్రసంగం‌.. మోదీపై నిప్పుల వర్షం!

అధ్యక్షుడిగా తొలి ప్రసంగం‌.. మోదీపై నిప్పుల వర్షం!
x
Highlights

కాంగ్రెస్‌లో నవ శకం ప్రారంభమైంది. 19 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త అధినేత వచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. వేలాది...

కాంగ్రెస్‌లో నవ శకం ప్రారంభమైంది. 19 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త అధినేత వచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వేడుకగా జరిగిన పట్టాభిషేకం కార్యక్రమానికి సోనియా, మన్మోహన్‌తో పాటు ప్రియాంక దంపతులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్ 49 వ అధ్యక్షుడు. అలాగే నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి.

అధ్యక్ష హోదాలో చేసిన తొలి ప్రసంగంలో రాహుల్ బీజేపీ, మోడీ సర్కారుపై నిప్పులు కురిపించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేదనీ వ్యక్తిస్వామ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రజల ఆలోచనలు, ఆహారపు అలవాట్ల మీద దాడి జరుగుతోందన్న రాహుల్ బీజేపీ కారణంగా దేశంలో హింస జరుగుతోందని మండిపడ్డారు. అసహన రాజకీయాలపై పోరాడుతూనే ఉంటామని ప్రతినబూనారు.

Show Full Article
Print Article
Next Story
More Stories