పట్నంకు ప్రధాని మోడీ రాక..

x
Highlights

తెలంగాణలో బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకులనే నమ్ముకున్న కమలం పార్టీ ఛరిష్మా ఉన్న నాయకులను రప్పిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది....

తెలంగాణలో బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకులనే నమ్ముకున్న కమలం పార్టీ ఛరిష్మా ఉన్న నాయకులను రప్పిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. నిన్నంతా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌, గడ్కరీతో ప్రచారం నిర్వహించిన కాషాయం పార్టీ ఇవాళ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్‌ బీ స్టేడియంలో 4 గంటలకు సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు రాష్ట్ర బీజేపీ క్యాడర్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని శివారు ప్రాంతల పరిధి నుంచి జనసమీకరణ చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులు సహా ముఖ్యనేతలు మొత్తం 40 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories