రైతు వినూత్న నిరసన...పొలం వద్ద పామును కాల్చుకుని తినేసిన రైతు

x
Highlights

ఇప్పటి వరకూ ఎన్నో రకాల నిరసనలను మనం చూశాం. కానీ, ఇలాంటి నిరసన మాత్రం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. పెద్దపల్లి జిల్లాలో ఓ యువ రైతు రెవెన్యూ అధికారుల తీరుకు...

ఇప్పటి వరకూ ఎన్నో రకాల నిరసనలను మనం చూశాం. కానీ, ఇలాంటి నిరసన మాత్రం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. పెద్దపల్లి జిల్లాలో ఓ యువ రైతు రెవెన్యూ అధికారుల తీరుకు విసుగు చెందాడు. తన భూమి సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో నిరసన తెలియజేయాలనుకున్న ఆ రైతు ఏం చేశాడో తెలుసా.. ఏకంగా ఓ తాచుపామును కాల్చుకుని తినేశాడు.

తిరుమల మద్దికుంటకు చెందిన శ్రీను అనే రైతు తన భూమి సమస్య కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎంతకాలమైనా పట్టించుకోవడం లేదని పొలం వద్దకు వెళ్లి పామును చంపి, దాన్ని అక్కడే కాల్చుకుని తిన్నాడు. ఆ ఘటన మొత్తాన్ని ఓ వీడియో తీసి అందరికీ పంపాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, తన సమస్య పరిష్కరించాలని ఆ రైతు డిమాండ్ చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories