భానుకిరణ్‌కి ఉరిశిక్ష పడిఉంటే బాగుండేది..

భానుకిరణ్‌కి ఉరిశిక్ష పడిఉంటే బాగుండేది..
x
Highlights

మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నాంపల్లి కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే, కాగా ఈ విషయంపై మద్దెలచెర్వు సూరి సతీమణీ గంగుల భానుమతి...

మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నాంపల్లి కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే, కాగా ఈ విషయంపై మద్దెలచెర్వు సూరి సతీమణీ గంగుల భానుమతి స్పందిస్తూ భాను కిరణ్‌కి యావజ్జీవశిక్ష కంటే ఏకంగా ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని భానుమతి చెప్పారు. ఇప్పటికైన హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని భానుమతి తెలిపారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని సూరి సతీమణి భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పు అనంతరం సూరి సతీమణి భానుమతి విలేకరులతో మాట్లాడారు. పరిటాల సునీత కుటుంబీకులపై కూడా విచారణ జరిపి ఉంటే బాగుండేదని భానుమతి పెర్కోన్నారు. సూరిని పేరును విచ్ఛలవిడిగా వాడుకుని భాను కిరణ్ కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశాడని భానుమతి దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories