ప్ర‌కాష్ రాజ్ కు షాకిచ్చిన ఉద‌య‌వాణి

ప్ర‌కాష్ రాజ్ కు షాకిచ్చిన ఉద‌య‌వాణి
x
Highlights

ప్ర‌ముఖ న్యూస్ పేప‌ర్ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి షాకిచ్చింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌కాష్ రాజ్ త‌న‌ని ఆ ప‌త్రిక నుంచి పంపించేందుకు...

ప్ర‌ముఖ న్యూస్ పేప‌ర్ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి షాకిచ్చింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌కాష్ రాజ్ త‌న‌ని ఆ ప‌త్రిక నుంచి పంపించేందుకు దృష్ట‌శ‌క్తులు కుట్ర‌చేశాయ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆరోపించారు.
క‌న్న‌డలో పాపుల‌ర్ న్యూస్ పేప‌ర్ అయిన ఉద‌య‌వాణిలో ప్ర‌కాష్ రాజ్ ప్ర‌తీ శ‌నివారం ”ఇరుదెల్లువ బిట్టు” అనే కాలం రాసేవారు. ఆ కాలంలో బీజేపీని, హిందూత్వంపై దుమ్మెత్తి పోస్తూ రాసేవారు. అయితే ఇప్పుడు ఆ కాలాన్ని ముగించేసిన స‌ద‌రు సంస్థ ఇక ప్ర‌కాష్ రాజ్ రాత‌లు అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది.

అస‌లే అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ పేప‌ర్ అయిన ఉద‌య‌వాణి లో త‌న కాల‌మ్ ఆగిపోవ‌డంతో ప్ర‌కాష్ రాజ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. హిందుత్వ రాజ‌కీయాల‌పై తాను చేస్తున్న ఘాటైన విమ‌ర్శ‌ల్లో భాగ‌మే ఈ క‌క్ష సాధింపు చ‌ర్య అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌ల‌పై కొత్తగా ఉద‌యవాణి ఎడిట‌ర్ శివ సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందించారు. కొత్త ర‌చ‌యిత‌లకు అవ‌కాశం ఇవ్వాల‌నే ఉద్దేశంతో ప్ర‌కాశ్‌రాజ్‌ను త‌ప్పించామ‌ని ఆయ‌న అన్నారు. ఇందులో ఎటువంటి రాజ‌కీయ ఒత్తిడి లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories