కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి
x
Highlights

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు...

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో పాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌, ప్రజాగాయకుడు గద్దర్‌ కుమారుడు జి.వి. సూర్యకిరణ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నాగం జనార్దన్‌రెడ్డి కొద్దికాలంగా భాజపాకు దూరంగా ఉంటున్నారు. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారనున్నారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఆయన పార్టీ మారడం వల్ల తమ పార్టీకి కలిగే నష్టమేమీ లేదని భాజపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories