కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ధ్వజం

x
Highlights

అన్ని పార్టీలకు ఒకే అధిష్టానం ఉంటే, కాంగ్రెస్ కు రెండు హై కమాండ్ లు ఉన్నాయని టీఆర్ ఎస్ ఎంపీ కవిత చెప్పారు. కాంగ్రెస్ కు ఒక అధిష్టానం ఢిల్లీలో ఉంటే మరో...

అన్ని పార్టీలకు ఒకే అధిష్టానం ఉంటే, కాంగ్రెస్ కు రెండు హై కమాండ్ లు ఉన్నాయని టీఆర్ ఎస్ ఎంపీ కవిత చెప్పారు. కాంగ్రెస్ కు ఒక అధిష్టానం ఢిల్లీలో ఉంటే మరో అధిష్టానం అమరావతిలోఉందని ఆమె ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ధీటుగా మరో పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ‌లో రెండు సంవ‌త్సరాల్లో పూర్తిస్తాయి రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 80 శాతం సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణను ఆంధ్రావారి పాలన నుంచి కష్టపడి తెచ్చుకుంది తిరిగి వారికే అప్పగించడానికి కాదన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ని గెలిపించి తీరుతారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories