రైతులకు ఎంత చేసినా తక్కువే -కేటీఆర్

రైతులకు ఎంత చేసినా తక్కువే -కేటీఆర్
x
Highlights

రైతులకు ఎంత చేసినా తక్కువేనని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్...

రైతులకు ఎంత చేసినా తక్కువేనని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేలు ఇస్తున్నామని గుర్తుచేశారు. అలాగే మళ్లీ అధికారంలోకి రాగానే 8000లకు స్వస్తి చెప్పి రూ.10వేలకు పెంచుతాంమని చెప్పారు. త్వరలోనే సిరిసిల్ల చుట్టూ రింగ్ వేసి ఎవరు ఉహించని విధంగా ఇది తంళ్లపల్లేనా అనే విధంగా రూపురేఖలు మార్చుస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన పథకాలను గుర్తుచేశాడు. సర్కారు దవాఖాణలో ప్రసవం అయి ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది విద్యార్థులను 800 పాఠశాలల్లో ఒక్కొక్కరిపై లక్షా 20వేల చొప్పున ఖర్చు చేసి చదివిస్తున్నామన్నామని వ్యాఖ్యనించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories