బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..

బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..
x
Highlights

తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో తన భర్త కొండా మురళితో కలిసి...

తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో తన భర్త కొండా మురళితో కలిసి సొంతగూటిలో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఆమె ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. బహిరంగ లేఖ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తర్వాత నిన్న రాత్రే ఢిల్లీకి చేరిన కొండా దంపతులు ఇవాళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఆమెకు మాత్రమే టిక్కెట్‌ వస్తుందని తెలుస్తోంది. ఇటు కొండా దంపతుల రాకతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మరింత బలపడినట్లైందని కాంగ్రెస్‌ కేంద్రనాయకత్వం భావిస్తోంది. పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, పడమర స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories