వాళ్లను కాల్చిపారేయండి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

వాళ్లను కాల్చిపారేయండి.. సీఎం సంచలన వ్యాఖ్యలు
x
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో ఇరుక్కున్నారు. జేడీస్ నేతను హత్య చేసిన వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు....

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో ఇరుక్కున్నారు. జేడీస్ నేతను హత్య చేసిన వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హొణ్నలగెరె ప్రకాశ్‌ అనే నేతను నిన్న సాయంత్రం బైక్ పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు, మద్దూర్‌ వద్ద అడ్డుకుని విచక్షణా రహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన ప్రకాశ్, చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. దోషులు కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఉత్తర్వులిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఏదో కోపంలో అలా అన్నానే కానీ, ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదన్నారు. ప్రకాశ్‌ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ఈ ఘటనకు నిరసనగా జేడీఎస్‌ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories