సిఎం యోగికి కేసీఆర్ సెటైర్..

సిఎం యోగికి కేసీఆర్ సెటైర్..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా అసెంబ్లీ ఎన్నికలు సాగాయి ఈ ఎన్నికల్లో ఎవరు ఉహించని విధంగా తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే....


తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా అసెంబ్లీ ఎన్నికలు సాగాయి ఈ ఎన్నికల్లో ఎవరు ఉహించని విధంగా తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరీంగనర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండి సంజేయ్ కుమార్ తరుపున ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో యూపీ సిఎం మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గెలిస్తే కరీంనగర్ జిల్లాను కరిపురంగా మారుస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దినిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ హైదరాబాద్ పేరు మారుస్తా..తోక మారుస్తా అన్నవారు ఏరి? అంటూ పరోక్షంగా యూపీ సీఎంపై సెటైర్లు వేశారు. అంతేకాకుండా మైనార్టీల భద్రతలో హైదరాబాద్ ముందుందని - ఈ విషయంలో హైదరాబాద్ ను దేశానికి మోడల్ గా చూపుతామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరుపునా హేమాహేమీలు పాల్గోన్నారు అయినా కేవలం ఒక్క చోటే ఆ పార్టీ గెలుపొందింది.

Show Full Article
Print Article
Next Story
More Stories