క‌త్తిమ‌హేష్ వివాదంలో జ‌న‌సేన లోగో

క‌త్తిమ‌హేష్ వివాదంలో జ‌న‌సేన లోగో
x
Highlights

సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో తేల్చుకుందామ‌ని క‌త్తిమ‌హేష్ ..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. అయితే ముందుగా చెప్పిన‌ట్లుగానే ప్రెస్...


సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో తేల్చుకుందామ‌ని క‌త్తిమ‌హేష్ ..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే. అయితే ముందుగా చెప్పిన‌ట్లుగానే ప్రెస్ మీట్ పెట్టిన క‌త్తిమ‌హేష్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖంగా ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ లు క్షుద్ర‌పూజ‌ల ప్ర‌స్తావ‌న తెచ్చారు. పవన్ - త్రివిక్రమ్ లు రెండు,మూడు క్షుద్రపూజలు చేశారని ..అందుకు తన వద్ద వీడియో సాక్ష్యం ఉందని ప్రెస్ క్లబ్ లో చెప్పిన.. మ‌హేష్ ఆ పూజ‌లు ఎందుకు చేస్తారో త‌న‌కు తెలుసున‌ని చెప్పుకొచ్చారు. తాను అనుకున్న‌ట్లుగా అవి తాంత్రిక పూజల‌ని..వాటిలో వేసే ముగ్గుల గురించి తెలుసన్నారు. అంతేకాదు ఆ పూజ‌ల‌కు సంబంధించి త‌న వ‌ద్ద వీడియోలు ఉన్నాయ‌ని..త్వ‌ర‌లో వాటిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని తెలిపారు.
ఇక జ‌న‌సేన లోగోపై కొన్ని అనుమానాల్ని వ్య‌క్తం చేశారు. లోగోలో తాంత్రిక పూజ‌ల‌కు సంబంధించిన తాంత్రిక ముగ్గులా ఉంద‌ని..వాటి గురించి నర‌సింహా అనే పూజారికి తెలుసున‌ని..వాటిపై విచార‌ణ జ‌రిపిస్తే పూజల విషయం బయటపడుతుందన్నారు.ఆ తాంత్రిక పూజలు నిర్వహించింది పవన్ - త్రివిక్రమ్ లేనని ఆ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఉన్నాయన్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించే ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ లు సమాజానికి ఆదర్శనీయంగా మారడం ప్రమాదకరమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories