కరక్కాయల స్కాం కేసులో కీలక నిందితుడి అరెస్ట్

కరక్కాయల స్కాం కేసులో కీలక నిందితుడి అరెస్ట్
x
Highlights

కరక్కాయల కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు మల్లికార్జున రెడ్డి తో పాటు మరో ముగ్గురు ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారి...

కరక్కాయల కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు మల్లికార్జున రెడ్డి తో పాటు మరో ముగ్గురు ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుండి 44 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న సైబరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపారు. కరక్కాయలు తీసుకుని పొడి చేసి ఇస్తే వెయ్యికి రూ.300 ఎక్కువగా ఇస్తామంటూ స్కాంను ప్రారంభించి దాదాపు రూ.10కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ స్కాంలో ఉన్నారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు సైబరాబాద్ కమిషన్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories