అమిత్‌షాకు టెలిస్కోప్ బహుమతిగా ఇస్తా: కాంగ్రెస్ నేత

అమిత్‌షాకు టెలిస్కోప్ బహుమతిగా ఇస్తా: కాంగ్రెస్ నేత
x
Highlights

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయపథకం ఎగరవేసిన విషయం తెలిసిందే. కాగా మూడు రాష్ట్ర్రాల్లో విజయంతో కాంగ్రెస్ నేతల్లో ...

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయపథకం ఎగరవేసిన విషయం తెలిసిందే. కాగా మూడు రాష్ట్ర్రాల్లో విజయంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సహం ఉట్టిపడుతోంది. కిత్రం బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై ఎన్ని విమర్శలు చేసిన తిరిగి ఎదురుదాడికి దిగలేదు. కాని ఇప్పుడు మూడు రాష్ట్రాల గెలుపుతో బీజేపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. మూడు రాష్ట్రాల విజయంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యాయి. బీజేపీ నేత అమిత్‌షా కాంగ్రెస్‌పై చాలాసార్లు విమర్శలు గుప్పించారు. తాగాజా ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు ఎన్నికల అనంతరం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం అన్నారు. కాగా ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తనదైన శైలీలో స్పందించారు. సిబల్ ఒక టెలిస్కోప్ కొనాలని అనుకుంటున్నానని, దానిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. టెలిస్కోప్‌తో చూస్తేనైనా రాజస్తాన్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని సిబల్ ఎద్దేవా చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories