లోయలో పడిన జవాన్ల బస్సు: ఒకరి మృతి

లోయలో పడిన జవాన్ల బస్సు: ఒకరి మృతి
x
Highlights

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీబీపీ జవాన్లు వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాన్ చనిపోగా మరో 24 మందికి గాయాలయ్యాయి....

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీబీపీ జవాన్లు వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాన్ చనిపోగా మరో 24 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని హెలికాప్టర్స్‌లో జమ్మూకు తరలించారు. రంబన్ జిల్లా ఖూనీనాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories