ఘోర బస్సు ప్రమాదం : 11మంది మృతి

ఘోర బస్సు ప్రమాదం : 11మంది మృతి
x
Highlights

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం లోరన్‌ నుంచి పూంఛ్‌...

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 11 మంది దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం లోరన్‌ నుంచి పూంఛ్‌ వెళ్తున్న ఓ బస్సు మండి ప్రాంతంలో రోడ్డుపై నుంచి జారిపడి పక్కనే ఉన్న లోతైన లోయలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టతకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. మరికొందరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories