జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్‌

జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్‌
x
Highlights

టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన బ్యానర్లే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు....

టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన బ్యానర్లే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ లాభాలు సాధిస్తున్న పలు నిర్మాణ సంస్థలు టీడీఎస్ సక్రమంగా కట్టడం లేదని గుర్తించిన ఐటీ అధికారుల వారి ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహించారు. ఇటీవల జై సింహా సినిమాను నిర్మించిన సి.కళ్యాణ్ , అజ్ఞాతవాసి సినిమాను నిర్మించిన హారికా హాసిని క్రియేషన్స్ ఆఫీసులతో పాటు సురేష్‌ ప్రొడక్షన్స్‌, భవ్య క్రియేషన్స్‌, డీవీవీ క్రియేషన్స్, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ లాంటి ఎనిమిది నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. మూడేళ్లుగా టీడీఎస్‌ చెల్లించని కొంతమంది నిర్మాతలకు నోటీసులిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories