వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్యపై భర్త ఘాతుకం

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్యపై భర్త ఘాతుకం
x
Highlights

హైదరాబాద్‌‌లో శాడిస్ట్‌ మొగుడు భార్యకు నరకం చూపించాడు. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టిన నగేష్‌ దారుణానికి ఒడిగడ్డాడు. భార్యకు...

హైదరాబాద్‌‌లో శాడిస్ట్‌ మొగుడు భార్యకు నరకం చూపించాడు. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టిన నగేష్‌ దారుణానికి ఒడిగడ్డాడు. భార్యకు పిచ్చి పట్టిందంటూ మంత్రగాడితో భార్యకు వాతలు పెట్టించాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో ఈ దారుణం జరిగింది. శామీర్‌పేట పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండలానికి చెందిన మంగకు 10 ఏండ్ల క్రితం మండలంలోని బొమ్మరాశిపేటకు చెందిన కంచుగంట్ల నగేష్‌తో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని ఏండ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో నగేష్‌కు వివాహేతర సంబం ధం ఏర్పడింది.

ఈ విషయంపై గొడవలు కూడా జరిగాయి. అయితే తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుపడుతుందని.. ఆమెను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. మంగకు ఆరోగ్యం బాగులేదని, దెయ్యం పట్టిందని నగేశ్ ప్రచారం చేశాడు. దీనికి మంత్రాలు, పూజలు చేయించడానికి సిద్ధమయ్యాడు. ఓ మంత్రగాడిని తీసుకొచ్చి.. ముగ్గుపోసి మంగకు బలవంతంగా మత్తుగోలీలు వేసి కూర్చోబెట్టారు. దీనికి నగేష్ తల్లి కూడా సహకరించింది. నగేష్, మంత్రగాడు బెల్డ్‌తో మంగను కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎక్కవకావడంతో మంగ భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని దవాఖానలో చేర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories