తప్పనిసరి పరిస్థితుల్లో పులిని చంపాల్సి వచ్చింది

x
Highlights

హైదరాబాద్ షార్ప్ షూటర్స్‌ షఫత్ అలీ, అజ్గర్ అలీలు మహారాష్ట్రలోని 22 గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించారు. అవని అనే పులి బారి నుంచి వారిని కాపాడారు. తమ...

హైదరాబాద్ షార్ప్ షూటర్స్‌ షఫత్ అలీ, అజ్గర్ అలీలు మహారాష్ట్రలోని 22 గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించారు. అవని అనే పులి బారి నుంచి వారిని కాపాడారు. తమ షూటింగ్‌ నైపుణ్యంతో కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యను పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాగం చేయలేని పనిని చాకచక్యంగా చేశారు. దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతంలో అవని అనే ఆడపులి గడిచిన రెండు సంవత్సరాల్లో 13 మంది మనుషులను చంపి తిన్నది. ఈ ఏడాది ప్రథమార్థంలో సుప్రీంకోర్టు పులిని చంపేందుకు షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీచేసింది. జంతు హక్కుల కార్యకర్తలు పులిని చంపడం కాకుండా ప్రాణాలతో పట్టుకోవాల్సిందిగా విన్నవించినప్పటికీ సుప్రీం నిరాకరిస్తూ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసింది. గత నెలన్నర నుంచి వేట ప్రారంభించిన హైదరబాద్ షార్ప్ షూటర్స్ అవనిని అంతమొందించారు. నవంబర్ 2 వ రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్ లో అజ్గర్ అలీ అవనిని కాల్చి చంపేశారు. పులి నుంచి గ్రామస్థులను రక్షించేందుకు టి1 ఆపరేషన్ చేపట్టామని మా ఆత్మరక్షణ కోసం అవనిని షూట్ చేయక తప్పలేదని అజ్గర్ అలీ తెలిపారు.

ఈ ఆపరేషన్‌పై వస్తున్న విమర్శలను అజ్గర్‌ తండ్రి షఫత్ అలీ తిప్పికొట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పులిని చంపాల్సి వచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అటవీశాఖ డైరెక్షన్‌లోనే ఆపరేషన్ చేపట్టడం జరిగిందని షఫత్ అలీ క్లారిటీ ఇచ్చారు. పులి అవని మృతితో యావత్మాల్ లోని స్థానికులు వేడుక చేసుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. మరోవైపు అవని కళేబరానికి నాగ్ పూర్ లోని గోరేవాడ రెస్క్యూ సెంటరులో పోస్టుమార్టం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories