కేసీఆర్ ప్రభుత్వంపై గుత్తా జ్వాల సంచలన ట్వీట్.. ఆ పై తొలగింపు!

కేసీఆర్ ప్రభుత్వంపై గుత్తా జ్వాల సంచలన ట్వీట్.. ఆ పై తొలగింపు!
x
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో ...

తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో ఆరోపించింది. ఆమె ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్‌ను తొలగించింది.

అకాడమీ నిర్మాణానికై జ్వాల భూమి కోసం తెలంగాణ సర్కార్‌ను సంప్రదించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అకాడమీకి భూమి కేటాయించకపోవడంపై ఆమె ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఆ విషయమేదో మంత్రి కేటీఆర్‌కు అదే ట్విటర్ వేదికగా తెలిపి ఉంటే చాలా సులువుగా పని అయిపోయేది’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌‌ని ఇచ్చిందని.. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం లేకపోయిందని, తనకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వలేదని చెప్పారు. , తనకు తప్ప అథ్లెట్లందరికీ ఇస్తున్నారని విమర్శించారు. గతంలో పుల్లెల గోపీచంద్‌పై కూడా జ్వాల విమర్శలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories