తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో ...
తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో ఆరోపించింది. ఆమె ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్ను తొలగించింది.
అకాడమీ నిర్మాణానికై జ్వాల భూమి కోసం తెలంగాణ సర్కార్ను సంప్రదించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అకాడమీకి భూమి కేటాయించకపోవడంపై ఆమె ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఆ విషయమేదో మంత్రి కేటీఆర్కు అదే ట్విటర్ వేదికగా తెలిపి ఉంటే చాలా సులువుగా పని అయిపోయేది’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అథ్లెట్స్కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్ని ఇచ్చిందని.. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం లేకపోయిందని, తనకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వలేదని చెప్పారు. , తనకు తప్ప అథ్లెట్లందరికీ ఇస్తున్నారని విమర్శించారు. గతంలో పుల్లెల గోపీచంద్పై కూడా జ్వాల విమర్శలు చేశారు.
@KTRTRS @TelanganaCMO
— Gutta Jwala (@Guttajwala) August 6, 2018
I have been after the TELANGANA govt too for some support to establish an academy for past 4 years but in vain...was promised I would be given the support but......
Also was promised a plot for house but every athlete seems to have got it except me!!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire