కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి చందూలాల్

కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి చందూలాల్
x
Highlights

ఓటమి భారం, కార్యకర్తల అభిమానం తట్టుకోలేక మాజీ మంత్రి చందూలాల్ కన్నీరు కార్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి...

ఓటమి భారం, కార్యకర్తల అభిమానం తట్టుకోలేక మాజీ మంత్రి చందూలాల్ కన్నీరు కార్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి విస్త్రతస్థాయి సమావేశం జరిగింది. చందూలాల్ ఓటమిపై నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా..చందూలాల్ భావోద్వేగానికిలోనై కంటతడిపెట్టుకున్నారు. సోమవారం ములుగులో జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ‘నాతో ఉంటూనే మోసంచేశారు.. డబ్బులకు అమ్ముడుపోయారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద కలిసి పని చేస్తామని మాటిచ్చి.. తీరా నన్ను ఓడించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో ఆయన కుమారుడు ప్రహ్లాద్‌ మాట్లాడుతూ అందరూ తన మనుషులు అనుకుంటే కలసికట్టుగా మోసం చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories