హరీశ్‌, రేవంత్‌లకు ఈసీ నోటీసులు

హరీశ్‌, రేవంత్‌లకు ఈసీ నోటీసులు
x
Highlights

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై...

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. తెలంగాణలోని పలువురు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేశారనే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories