‘పంజాగుట్ట’ రూమ్‌లో త్రివిక్రమ్

‘పంజాగుట్ట’ రూమ్‌లో త్రివిక్రమ్
x
Highlights

చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి .. రచయితగా నిలదొక్కుకునే రోజుల్లో త్రివిక్రమ్ పంజాగుట్టలోని ఒక రూమ్ లో ఉండేవారు. ఈ రూమ్ లో కూర్చునే ఆయన రెడీ చేసిన...

చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి .. రచయితగా నిలదొక్కుకునే రోజుల్లో త్రివిక్రమ్ పంజాగుట్టలోని ఒక రూమ్ లో ఉండేవారు. ఈ రూమ్ లో కూర్చునే ఆయన రెడీ చేసిన కథలకు .. అందించిన మాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సెంటిమెంట్ తోనే ఆ రూమ్ కి అప్పటి నుంచి ఆయన రెంట్ కట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే కూర్చుని ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.

ఏ ముహూర్తాన టైటిల్ ఫిక్స్ అయ్యిందోకానీ ‘అజ్ఞాతవాసి’తో యూనిట్‌కి, ఇండస్ట్రీకి ఊహించని షాక్ తగిలింది. పవన్ ఎట్టకేలకు తేరుకొని సినిమాలకు బై అనేసి.. పొలిటికల్ టూర్స్ స్టార్ట్ చేశాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు.. ప్లాప్‌కి తోడు కాపీ వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసంలోవున్న త్రివిక్రమ్, తనకు లక్ తెచ్చిన పంజాగుట్ట రూమ్‌లో తారక్‌ ప్రాజెక్ట్‌‌కి స్టోరీ రెడీ చేస్తూ బిజీ అయ్యాడట. ఇక ఎన్టీఆర్ సినిమాను కూడా 'మధుబాబు' రాసిన ఒక డిటెక్టివ్ నవల ఆధారంగా చేస్తున్నారనే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ముగ్గురు అసిస్టెంట్స్ తో త్రివిక్రమ్ ఆ రూమ్ లోనే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సారి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories