బిగ్ బాస్2: దీప్తి సునైనా ఔట్.. ఎమోషనల్ అయిన తనీష్

బిగ్ బాస్2: దీప్తి సునైనా ఔట్.. ఎమోషనల్ అయిన తనీష్
x
Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్...

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డుతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది. ఈ వారం దీప్తి సునైనా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి సునైనా హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తరువాత స్టేజ్ మీదకి వచ్చిన సునైనా.. తనీష్, సామ్రాట్ లతో మాట్లాడాలని ఉందని కోరింది. తనీష్ తో మాట్లాడుతూ.. 'ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్.. టైటిల్ కొట్టి బయటకి రా' అని చెప్పగానే తనీష్ 'నాకు కూతురు పుడితే నీలాగానే ఉండాలని కోరుకుంటాను. నువ్ నీలానే ఉండు' అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సునైనా బిగ్ బాంబ్ ని తనీష్ పై విసిరింది. దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో సాంగ్ వచ్చిన ప్రతిసారి స్విమ్మింగ్ పూల్ లో దూకాల్సివుంటుంది. సునైనా ఎలిమినేట్ కావడం వెనుక కౌశల్ ఆర్మీ ప్రభావం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories