డిసెంబర్ 7న సెలవు: రజత్‌కుమార్

డిసెంబర్ 7న సెలవు: రజత్‌కుమార్
x
Highlights

తెలంగాణలో వచ్చేనెల డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో డిసెంబర్ 7న మాత్రం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన...

తెలంగాణలో వచ్చేనెల డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో డిసెంబర్ 7న మాత్రం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సంయుక్త ముఖ్యఎన్నికల అధికారి ఆమ్రపాలితో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకొవాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపీణీ శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. అలాగే ‘నా ఓటు యాప్‌’ను రజత్ కుమార్ విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ స్టేషన్ వివరాలు సులవుగా తెలుసుకోవచ్చని, దివ్యాంగులకు ఉచిత రవాణా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలు చేరుకున్నాయని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories