ఢిల్లీని తాకిన కాంగ్రెస్ అసంతృప్తుల సెగ

x
Highlights

దీపావళి వేళ కాంగ్రెస్ అధిష్టానానికి అసంతృప్తుల సెగ తగిలింది. టికెట్లు ఆశించి తమకు రాదని భావిస్తున్న నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూం ఎదుట ఆందోళనకు...

దీపావళి వేళ కాంగ్రెస్ అధిష్టానానికి అసంతృప్తుల సెగ తగిలింది. టికెట్లు ఆశించి తమకు రాదని భావిస్తున్న నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సీట్లు కేటాయించాలంటూ నిరసన చేపట్టారు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి నిరసనకు దిగారు . దేవరకొండ సీటు తనకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. స్క్రీనింగ్ కమిటీ తన పేరు ప్రతిపాదించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories