‘బ్లేడుతో గొంతు కోసుకుంటా’ అన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బండ్ల గణేశ్!

‘బ్లేడుతో గొంతు కోసుకుంటా’ అన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బండ్ల గణేశ్!
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే ‘7 o clock’ బ్లేడుతో గొంతు కోసుకుంటానని కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేశ్ గతంలో ఓ టీవీ ఛానల్...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే ‘7 o clock’ బ్లేడుతో గొంతు కోసుకుంటానని కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేశ్ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత సదరు ఛానల్ విలేకరి ఆయన ఇంటికి వెళ్లగా బండ్ల గణేశ్ అందుబాటులోకి రాలేదు. తాజాగా సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. కోపంలో వంద అంటాం.. రాజకీయాల్లో చాలా మంది చాలా అంటారు అవన్నీ అవుతాయా? గెలవలేదు కరక్టే ఇప్పుడు ఏం చేయమంటారు? పీక కోసుకోలేంగా.. మా పార్టీ నాయకులకు కాన్ఫిడెన్స్ ఇద్దాం అని పీక కోసుకుంటా అన్నా.. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఏం చేస్తాం.. దేవుడి సన్నిధానంలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇక్కడ మాట్లాడకూడదు మిగతావి తరువాత మాట్లాడతా’ అంటూ తనదైన శైలిలో బ్లాడ్ కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు బండ్ల గణేష్.

Show Full Article
Print Article
Next Story
More Stories