పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

పింఛన్‌దారులకు గుడ్ న్యూస్
x
Highlights

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఆసరా పెన్షన్లపై దృష్టి సారించిన ఆయన పంచాయతి రాజ్‌,...

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఆసరా పెన్షన్లపై దృష్టి సారించిన ఆయన పంచాయతి రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అందజేయాలని ఆదేశించిన ఆయన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలంటూ సీఎస్‌కు సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించిన ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన అర్హులందరికి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే 20 లక్షల మందిని గుర్తించిన అధికారులు గ్రామాల వారిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories