కోడలు కోసం కదిలిన బాబు

x
Highlights

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిని నందమూరి సుహాసిని కోసం ఫ్యామిలీ కదిలి వస్తోంది. మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన సుహాసిని గెలిపించుకునేందుకు కుటుంబ...

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిని నందమూరి సుహాసిని కోసం ఫ్యామిలీ కదిలి వస్తోంది. మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన సుహాసిని గెలిపించుకునేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. బాబాయ్ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి నామినేషన్ వేయించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సుహాసినికి మద్దతుగా నిలిచారు. ఆమె గెలుపు కోరుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుహాసినికి సీటు ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. శనివారం సుహాసినికి మద్దతుగా చంద్రబాబునాయుడు కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాజేంద్రనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్న 3.30 నుంచి కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేస్తారు. జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, వై జంక్షన్, మూసాపేట, మోతీనగర్‌ల మీదుగా కొనసాగనున్నది.

ఇప్పటికే ఆమెకు మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం చేశారు. మరోవైపు సుహాసిని గెలుపుపై నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. తన కోడలు సుహాసిని గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. సుహాసినికి భువనేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ శనివారం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బాలయ్య ప్రచారం చేయనున్నారు. మొదటగా సనత్‌‌నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్‌‌ తరఫున ఎమ్మెల్యే బాలయ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముషీరాబాద్ కూటమి అభ్యర్థి అనిల్ కుమార్‌యాదవ్‌‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు బాలయ్య. ఇటు చంద్రబాబు, అటు బాలయ్య ప్రచారం కూటమి అభ్యర్థుల్లో , టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories