మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు

మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు
x
Highlights

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాల వారీగా...

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీటీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు.... మే 10నుంచి జిల్లాలవారీగా నివేదికలు ఇవ్వాలని సూచించారు. మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలన్న చంద్రబాబు.... అన్ని జిల్లాల్లో కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణపై తీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, దైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మెతక వైఖరి మానుకోవాలని, కఠినంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు చెప్పారు. జాతీయ మహనాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని, 2019లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తాను జాబితా సిద్ధం చేసుకున్నానని, ప్రతిభను బట్టి ముందుగానే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. మనం బలంగా ఉంటేనే ఎవరైనా పొత్తులకు ముందుకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories