గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగం చేశారు- చంద్రబాబు

గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగం చేశారు- చంద్రబాబు
x
Highlights

కన్నడ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు, కర్ణాటకలో గవర్నర్ పాలన దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేలు...

కన్నడ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు, కర్ణాటకలో గవర్నర్ పాలన దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేలు వెళ్లడానికి విమానాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. తమిళనాడు, కర్ణాటక మాదిరిగానే ఏపీని చేయాలని చూస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. దేశాన్ని ఉద్దరిస్తామన్న వారు కర్ణాటక విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. గాలి జనార్దన్‌రెడ్డి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడి ఆస్తులు 100 రెట్లు పెంచుతామని ఎలా అంటారని, దీనిపై మోడీ, అమిత్‌షా ఏం సమాధానం చెబుతారన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories