పరకాలలో కొండా సురేఖ ఓటమి

పరకాలలో కొండా సురేఖ ఓటమి
x
Highlights

పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి...

పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ సురేఖ కాంగ్రెస్‌లో చేరి, ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాల ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించారని.. ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. తాను ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో ఉంటే కొండా దంపతులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నాడే తాను చెప్పాను.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవడీ నరాలు తెగుతాయో? టీవీలు, రిమోట్లు, సెల్‌ఫోన్లు పగులుతాయో? వేచి చూడండని చెప్పానని ధర్మారెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చాలా వింతలు చూడాల్సి వస్తదని కొండా దంపతులను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories