తాళి కట్టే వేళ..వధూవరుల ఎస్కేప్‌.. ఆగిపోయిన పెళ్లి

తాళి కట్టే వేళ..వధూవరుల ఎస్కేప్‌.. ఆగిపోయిన పెళ్లి
x
Highlights

పెళ్లి మంటపంలో వధూవరులు కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన ఆదివారం కోలారు జిల్లా, మాలూరులోని పద్మావతి కళ్యాణ మంటపంలో చోటు చేసుకుంది. వివరాలు... బెంగళూరు...

పెళ్లి మంటపంలో వధూవరులు కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన ఆదివారం కోలారు జిల్లా, మాలూరులోని పద్మావతి కళ్యాణ మంటపంలో చోటు చేసుకుంది. వివరాలు... బెంగళూరు నగరానికి 46 కిలోమీటర్ల దూరంలోని పద్మావతి కల్యాణ మండపంలో వరుడు గురేష్ (23) వధువు సౌమ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సందడి ఆరంభమైంది. వరుడు గురేష్ ముస్తాబై వధువు రాక కోసం పెళ్లి మండపంలో ఎదురుచూస్తుండగా అంతలో వధువు తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. అంతే వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఎట్టకేలకు వధువుకు చెల్లెలు అయిన బాబాయ్ కూతురైన వెంకటరత్నమ్మ అనే మరో అమ్మాయితో గుర్రేష్ కు వివాహం చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు. వీరి వివాహానికి సంప్రదాయ బద్ధంగా పూజాదికాలు నిర్వహించారు. విందు కూడా జరిగింది. అంతలో ఈ సారి వరుడు వధువుకు షాకిచ్చి పారిపోయాడు. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి వుండగా, షేవింగ్ చేయించుకుని వస్తానని బయటకు వెళ్లిన గురేష్ తిరిగి రాలేదు సరికదా... తన ఫోన్ ను కూడా స్విచ్చాఫ్ చేశాడు. దీంతో మరింత గందరగోళం ఏర్పడగా, పెళ్లివచ్చిన వారంతా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అతను తన ప్రియురాలి కోసం వెళ్లిపోయాడని కొందరు, పెళ్లి ఇష్టం లేక పారిపోయాడని మరికొందరు వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories