డిసెంబర్ 18 తరువాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు : బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు

Highlights

ఓయూలో జరిగిన రాళ్ల దాడిపై బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడారు.. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని...

ఓయూలో జరిగిన రాళ్ల దాడిపై బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడారు.. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అయన అన్నారు.. అంతేకాదు ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్యకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని అన్నారు.. ఇక డిసెంబర్ 18 తరువాత కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కోల్పోతుందని, త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీకి 25 సీట్లు మించి రావని కృష్ణసాగర్ రావు చెప్పారు.. కాగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వమ్యం లేదని ఆపార్టీ నాయకులే కొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హమన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories