అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు
x
Highlights

విపక్ష పార్టీల ఫెడరల్ ఫ్రంట్ యత్నాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు,...

విపక్ష పార్టీల ఫెడరల్ ఫ్రంట్ యత్నాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. 2019 ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న అమిత్ షా...అప్పటికి విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీని ఏమీ చేయలేవన్నారు. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే.. విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories