బన్నీ మాత్రం చెప్పలేదు బ్రదర్‌!

బన్నీ మాత్రం చెప్పలేదు బ్రదర్‌!
x
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ప్రజా యాత్రను సోమవారం ప్రారంభించారు. నిన్న జనసేన కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఆంజనేయస్వామి దర్శనానంతరం...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ప్రజా యాత్రను సోమవారం ప్రారంభించారు. నిన్న జనసేన కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఆంజనేయస్వామి దర్శనానంతరం కరీంగనగర్‌ చేరుకున్న పవన్‌ విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నేను భారతీయుడిని. నా మాతృభూమిని జాగ్రత్తగా చూసుకుంటాను.’అన్నారు. పవన్‌ యాత్ర ప్రారంభించిన సందర్భంగా మెగా బ్రదర్లు ట్విటర్‌ వేదికగా ఆయనకి మద్దతు తెలిపారు.

‘నేను భారతీయుడిని. నా మాతృభూమి జాగ్రత్తగా చూసుకుంటాను.’ చలోరే చలోరే చల్‌ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. బాబాయ్‌..ఆల్‌ ది బెస్ట్‌. జై జనసేన’- రామ్‌చరణ్‌

‘ఆల్‌ ది బెస్ట్‌ బాబాయ్‌.’- వరుణ్‌ తేజ్‌

‘మీ వెంటే మేము. జై జనసేన’- ధరమ్‌ తేజ్‌

అయితే మెగా హీరో ట్యాగ్‌ లైన్‌తో చెలామణి అవుతున్న అల్లు అర్జున్‌ మాత్రం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించలేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. ఇప్పటిదాకా పవన్‌కు విషెస్‌ చెప్పకపోవటం వెనుక కొందరు కారణాలను అన్వేషిస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ బ్రదర్‌ అల్లు శిరీష్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఏది ఏమైనా సరైనోడు చిత్ర బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పీకే ఫ్యాన్స్‌కు దూరమైన బన్నీ నుంచి.. ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవటం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories