మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు శిక్ష..

మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు శిక్ష..
x
Highlights

డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్‌ (52)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతోపాటు రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు...

డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్‌ (52)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతోపాటు రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. బాలికపై అత్యాచారం కేసులో రాజ్‌కుమార్‌ నిందితుడిగా ఉన్నాడు. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజ్‌కుమార్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనికి చేరింది. దాంతో ఆమెపై రాజ్‌కుమార్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్‌ చేసి తనను తీసుకెళ్లాలని కోరింది. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు బయలుదేరారు. ఇంతలో రాజ్‌కుమార్‌ స్నేహితుడు జయశంకర్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు.

తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా ఆమె మరణించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. ఈ కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్‌ సెల్వం సహా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇన్ని రోజుల తరువాత ఈ కేసులో తీర్పు వెలువడింది. మాజీ ఎమ్మెల్యే ఎం.రాజ్‌కుమార్‌, ఆయనకు సహకరించిన స్నేహితుడు జయశంకర్ పై నేరం రుజువు కావడంతో వారికిపదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు.మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు శిక్ష..

Show Full Article
Print Article
Next Story
More Stories