ఎన్నికల రణక్షేత్రంలో ప్రచార హోరు..మూడే రోజుల గడువుతో జోరు పెంచిన పార్టీలు

x
Highlights

మూడంటే మూడు రోజులు. తెలంగాణలో ప్రచార పర్వానికి మిగిలిన సమయమిది. ఎన్నికల ప్రచారం ముగియడానికి గడువు ముంచుకొస్తుండడంతో రాజకీయ పార్టీలు జోరు...

మూడంటే మూడు రోజులు. తెలంగాణలో ప్రచార పర్వానికి మిగిలిన సమయమిది. ఎన్నికల ప్రచారం ముగియడానికి గడువు ముంచుకొస్తుండడంతో రాజకీయ పార్టీలు జోరు పెంచుతున్నాయి. జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దించుతుంటే ప్రాంతీయ పార్టీలు అలుపెరగక ప్రచారం సాగిస్తున్నాయి. ఇవాళ ప్రధాని మోడీ తెలంగాణలో రెండోసారి ఎన్నికల ప్రచారానికి వస్తుంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మూడోసారి ప్రచారానికి వస్తున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి ప్రచారంతో హోరెత్తిస్తున్న చంద్రబాబు మరోసారి రాహుల్ గాంధీతో కలసి రోడ్ షోలు నిర్వహిస్తారు. ఇక సీఎం కేసీఆర్ కూడా ఇవాళ ఆరు సభల్లో ప్రసంగిస్తారు. మొత్తంగా తెలంగాణ మొత్తం ఎలక్షన్ మేనియాలో మునిగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories