బ్యాంకులకు 5 రోజులు సెలవులు

బ్యాంకులకు 5 రోజులు సెలవులు
x
Highlights

దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమ్మెతో బ్యాంకులు పని...

దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమ్మెతో బ్యాంకులు పని చేయవు. బ్యాంకుల్లో పనులు ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. వరుస సెలవులతో ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 21న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. నాలుగు యూనియన్ల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. లక్షలాది మంది సిబ్బంది విధులకు దూరంగా ఉండనున్నారు. 11వ వేతన సవరణ చేయాలని, బ్యాంకుల విలీనం ప్రక్రియ ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక డిసెంబర్ 22 నాలుగో శనివారం, డిసెంబర్ 23 ఆదివారం బ్యాంకులకు సెలవు రోజులు. డిసెంబర్ 24న బ్యాంకులు పని చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగులు సెలవులో ఉంటున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 26న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు తప్ప మిగతా సేవలన్నీ నిలిచిపోనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో పాటు వరుస సెలవులు ఖాతాదారులపై ప్రభావం చూపే అవకాశముంది. లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని సమ్మెకు సహకరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. మరో వైపు సెలవులతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. రేపు సమ్మె జరిగినా ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. శుక్రవారం ఒక్క రోజు నగదు సమస్య ఉండకపోవచ్చు. డిసెంబరు 26 వరకు మాత్రం నగదు కొరత ఏర్పడే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories