హాయ్‌లాండ్ కనీస ధర ఖరారు

x
Highlights

అగ్రిగోల్డ్ కేసులో హాయ్‌లాండ్ వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 600 కోట్లు రిజర్వ్ ధరను నిర్ణయించిన హైకోర్టు. సీల్డ్ కవర్‌లో బిడ్డర్స్‌ను...


అగ్రిగోల్డ్ కేసులో హాయ్‌లాండ్ వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 600 కోట్లు రిజర్వ్ ధరను నిర్ణయించిన హైకోర్టు. సీల్డ్ కవర్‌లో బిడ్డర్స్‌ను ఆహ్వానించాలని తెలిపింది. కొన్నేళ్లుగా నలుగుతున్న అగ్రిగోల్డ్ కేసులో మరో అడుగు ముందుకు పడింది. కోట్లాది రూపాయలు నష్టపోయామని కోర్టును ఆశ్రయించిన బాధితులకు న్యాయం జరుగబోతోంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. హాయ్ లాండ్ ను వేలం వేయడానికి దాని కనీస దరను 600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది.

ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు హాయ్ లాండ్ విలువ ఎంత ఉంటుందనే దానిపై ధరను కోర్టుకు సమర్పించాయి. తర్వాత హాయ్ లాండ్ ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. హాయ్ లాండ్ లోని కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టారు. అందువల్ల ఆ ఆస్తిని వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories