శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్‌జెండర్లు

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్‌జెండర్లు
x
Highlights

ట్రాన్స్‌జెండ‌ర్లు ఇవాళ శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఈనెల 16న అనుమతి నిరాకరించిన...

ట్రాన్స్‌జెండ‌ర్లు ఇవాళ శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఈనెల 16న అనుమతి నిరాకరించిన ట్రాన్స్‌జెండర్ల బృందానికి ఎట్టకేలకు ఇవాళ అనుమతి లభించింది. ఆలయ ప్రధాన అర్చకుడితో సంప్రదింపుల అనంతరం వారికి అనుమతి లభించింది. దీంతో అయ్యప్ప శరణు ఘోష చేస్తూ ట్రాన్స్‌జెండర్ల బృందం సన్నిధానం చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. న‌ల్ల‌చీర‌లు ధ‌రించి, ఇరుముడితో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వ‌చ్చిన న‌లుగురు ట్రాన్స్‌జెండ‌ర్లకు పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. నీల‌క్క‌ల్ నుంచి పంబ వ‌ర‌కు, ఆ త‌ర్వాత కొండ ఎక్కుతున్న స‌మ‌యంలో పోలీసులు వారికి ర‌క్ష‌ణ క‌ల్పించారు. ఆల‌యంలోకి ప‌విత్ర‌మైన 18 మెట్ల‌ను కూడా వాళ్లు ఎక్కారు. న‌లుగురు ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను అన‌న్య‌, తృప్తి, రెంజుమోల్‌, అవంతిక‌లుగా గుర్తించారు. 10 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న మ‌హిళ‌లు కూడా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు అంటూ ఇటీవ‌ల సుప్రీం తీర్పు ఇచ్చిన త‌ర్వాత అక్క‌డ ఆందోళ‌న‌లు మిన్నంటిన విష‌యం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories