మరో ఘోర బస్సు ప్రమాదం : 13మంది మృతి

మరో ఘోర బస్సు ప్రమాదం : 13మంది మృతి
x
Highlights

జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13...

జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories