<?xml version="1.0" encoding="UTF-8" standalone="no"?>
<rss xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
<channel>
<title><![CDATA[Andhra Pradesh News in Telugu | ఆంధ్ర ప్రదేశ్ వార్తలు | Latest Andhra Pradesh News Headlines in Telugu]]></title>
<description><![CDATA[Latest Andhra Pradesh Telugu news on HMTV Live – breaking updates on politics, local events, and state developments]]></description>
<link>https://www.hmtvlive.com/andhrapradesh</link>
<image>
<url>https://www.hmtvlive.com/images/logo.png</url>
<title>Andhra Pradesh News in Telugu | ఆంధ్ర ప్రదేశ్ వార్తలు | Latest Andhra Pradesh News Headlines in Telugu</title>
<link>https://www.hmtvlive.com/andhrapradesh</link>
</image>
<lastBuildDate>Wed, 08 Apr 2026 12:53:53 GMT</lastBuildDate>
<atom:link href="https://www.hmtvlive.com/category/andhrapradesh/google_feeds.xml" rel="self" type="application/rss+xml"/>
<atom:link href="https://pubsubhubbub.appspot.com/" rel="hub" type="application/rss+xml"/>
<pubDate>Wed, 08 Apr 2026 12:53:53 GMT</pubDate>
<copyright><![CDATA[HMTV]]></copyright>
<language><![CDATA[te]]></language>
<ttl>1</ttl>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్]]></category>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/kimidi-ram-mallik-naidu-distributes-cmrf-checks-in-gurla-garividi-145200</link>
<title><![CDATA[Vizianagaram: బాధితుల ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి]]></title>
<description><![CDATA[Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మరియు గరివిడి మండలాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పర్యటించారు.]]></description>
<enclosure length="229711" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410967-vizianagaram-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410967-vizianagaram-.webp'/><figcaption><p>Vizianagaram: బాధితుల ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vizianagaram:</b> గుర్ల మరియు గరివిడి మండలాలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కుల పంపిణీ చేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు. గుర్ల మరియు గరివిడి మండలాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు.</p>
<p>ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ.. నిరుపేదలకు ఆపద సమయంలో అండగా నిలవడమేకూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ నిధులను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.</p>
<p>నేడు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:</p>
<p>దాసరి సూరమ్మ: రూ. 1,42,290/-</p>
<p>దాసరి గోవింద్: రూ. 66,900/-</p>
<p>కరిమజ్జి పెంటమ్మ: రూ. 43,364/-</p>
<p>మీసాల అప్పలనాయుడు: రూ. 1,42,862/-</p>
<p>మొత్తం 3,95,416 రూపాయలు అందించారు. గరివిడి మండలం లో బసవ తిరుమలరావు ₹43,306. రెండు మండలాల్లో అత్యధిక మొత్తంలో సహాయం అందడంతో లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి, ఇంటి వద్దకే వచ్చి చెక్కులు అందజేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/kimidi-ram-mallik-naidu-distributes-cmrf-checks-in-gurla-garividi-145200</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విజయనగరం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 12:53:46 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/collector-harendra-prasad-launches-free-solar-scheme-in-pithapuram-145199</link>
<title><![CDATA[Pithapuram: ఇక విద్యుత్ బిల్లుల భారం ఉండదు.. లబ్ధిదారులకు వరం సూర్య ఘర్]]></title>
<description><![CDATA[Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరులో 'ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన'ను కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ప్రారంభించారు.]]></description>
<enclosure length="85116" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410966-pithapuram-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410966-pithapuram-.webp'/><figcaption><p>Pithapuram: ఇక విద్యుత్ బిల్లుల భారం ఉండదు.. లబ్ధిదారులకు వరం సూర్య ఘర్</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Pithapuram:</b> ST ,SC విద్యుత్ వినియోగదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సోలార్ విద్యుత్తు పథకాన్ని వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ తెలియజేశారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో STSC విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ విద్యుత్ ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది.</p>
<p>ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ హాజరయ్యారు అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కమిటీ సభ్యులు పెండం దొరబాబు తుమ్మల రామస్వామి ఓదూరి కిషోర్ హాజరయ్యారు ముందుగా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఉచిత సోలార్ పథకాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.</p>
<p>అనంతరం లబ్ధిదారులతో జరిగిన సభలో కలెక్టర్.హరేందిరా ప్రసాద్ పెండెం దొరబాబు తుమ్మల రామస్వామి ఓదూరి కిషోర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు వెన్న జగదీష్, తుమ్మల బాబు, రాయుడు రాజు ,వీరంరెడ్డి చిన్న పిల్లా శివశంకర్ రెడ్డెం జనార్దన్ పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/collector-harendra-prasad-launches-free-solar-scheme-in-pithapuram-145199</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,కాకినాడ]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 12:31:10 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/mp-bharat-whip-ganababu-launch-projects-in-vizag-west-145198</link>
<title><![CDATA[Vizag: విశాఖ పశ్చిమలో అభివృద్ధి పండగ.. కోట్లతో కొత్త హంగులు!]]></title>
<description><![CDATA[Vizag: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 2.39 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, వార్డు కార్యాలయ భవనాలను ఎంపీ ఎం. శ్రీ భరత్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు.]]></description>
<enclosure length="104766" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410965-vizag-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410965-vizag-.webp'/><figcaption><p>Vizag: విశాఖ పశ్చిమలో అభివృద్ధి పండగ.. కోట్లతో కొత్త హంగులు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vizag:</b> విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 2.39 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ భరత్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52, 89 మరియు 90 వార్డులలో సుమారు 2.39 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం. శ్రీ భరత్ గారు మరియు ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు నేడు ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే లక్ష్యంతో ఈ పనులను పూర్తి చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.</p>
<p><b>నేడు ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు:</b></p>
<p><b>52వ వార్డు: </b>వుడా కాలనీలో రూ. 23 లక్షలతో నిర్మించిన స్వర్ణ వార్డు కార్యాలయ భవనం మరియు రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తును ప్రారంభించారు.</p>
<p><b>90వ వార్డు: </b>కనకమహాలక్ష్మి నగర్‌లో రూ. 13.45 లక్షల వ్యయంతో నిర్మించిన పబ్లిక్ పార్కు మరియు రూ. 32.50 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. కాకాని నగర్‌లో రూ. 35 లక్షలతో నిర్మించిన మహిళా భవనం మరియు ఏఎస్ఆర్ నగర్‌లో రూ. 18 లక్షల వ్యయంతో ఆధునీకరించిన పబ్లిక్ పార్కును ప్రజలకు అంకితం చేశారు.</p>
<p><b>89వ వార్డు: </b>కొత్తపాలెంలో రూ. 19.6 లక్షల వ్యయంతో పబ్లిక్ పార్కు మరియు రూ. 49.80 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. సంతోష్ నగర్‌లో రూ. 19.90 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ మరియు రూ. 19.85 లక్షలతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తును ప్రారంభించారు. ఆదర్శ్ నగర్‌లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ (కంశాలి) కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ భరత్ గారు ప్రారంభించారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ గారు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో పార్కులు మరియు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో APUFIDC డైరెక్టర్ అంగ ప్రశాంతి, స్థానిక నాయకులు బొడ్డేటి విజయ్, వై తిరుమల రావు, వి చంద్ర శేఖర్, బొమ్మిది రమణ , ప్రసాద్, అరుణ్, దాడి రమేష్, కూటమి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు నాయకులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/mp-bharat-whip-ganababu-launch-projects-in-vizag-west-145198</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 12:23:48 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/humanity-in-palavalasa-psi-seva-samstha-helps-bereaved-family-145195</link>
<title><![CDATA[Palavalasa: పేద కుటుంబానికి అండగా PSI సేవా సంస్థ.. విరాళం అందజేత!]]></title>
<description><![CDATA[Palavalasa: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో అనారోగ్యంతో పెద్దదిక్కును కోల్పోయిన పేద కుటుంబానికి PSI సేవా సంస్థ అండగా నిలిచింది.]]></description>
<enclosure length="221925" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410962-palavalasa-psi-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410962-palavalasa-psi-.webp'/><figcaption><p>Palavalasa: పేద కుటుంబానికి అండగా PSI సేవా సంస్థ.. విరాళం అందజేత!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Palavalasa:</b> శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, పాలవలస గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు మరణించడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. </p>
<p> ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన PSI సేవా సంస్థ స్పందించి, దయగల దాతల నుండి విరాళాలు సేకరించి,08-డిసెంబర్-2025 నాడు ₹10,016/- మరియు ఈరోజు ₹40,000/- మొత్తంగా ₹50,016/- ను PSI కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.</p>
<p> ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం మరియు అత్యవసర అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచిస్తూ, భవిష్యత్తులో కూడా తమ PSI సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/humanity-in-palavalasa-psi-seva-samstha-helps-bereaved-family-145195</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,శ్రీకాకుళం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 12:09:23 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/vasupalli-ganesh-kumars-peace-walk-for-world-peace-145193</link>
<title><![CDATA[Vizag: ప్రపంచ శాంతి కోసం వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర]]></title>
<description><![CDATA[Vizag: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోవాలని కోరుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర చేపట్టారు.]]></description>
<enclosure length="233999" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410960-vizag-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410960-vizag-.webp'/><figcaption><p>Vizag: ప్రపంచ శాంతి కోసం వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vizag:</b> పచ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా - ఇరాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మంగళవారం రాత్రి దేశాన్ని తుడిచిపెడతానని బెదిరించడం విచారకర్మన్నారు.</p>
<p>ఆయన నిర్ణయంలో మార్పు రావాలని కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రాత్రి పాత నగరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ఆసీలమెట్ట శ్రీ సంపత్ వినాయక ఆలయం వరకు చెప్పులు లేకుండా కాలినడకన వైసిపి శ్రేణులతో కలిసి శాంతియాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే అది ప్రపంచ వినాశనమే అని చెప్పారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇతర దేశాలను బెదిరిస్తూ అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.</p>
<p>రష్యా దగ్గర అమెరికా గంట ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే చైనా వద్ద కూడా ఉన్నాయని చెప్పారు. అణుయుద్ధం అంటూ వస్తే ప్రపంచం వినాశనమవుతుందని పేర్కొన్నారు. ఇరాన్ తమ షరతులకు ఒప్పుకోకపోతే ఆ దేశం పై అణు దాడి చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతూ తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వాసుపల్లి వెల్లడించారు.</p>
<p><b>★ పది రోజుల కాల్పులు విరమణ..</b></p>
<p>మంగళవారం రాత్రి వాసుపల్లి గణేష్ కుమార్ ట్రంప్ నిర్ణయంలో మార్పు రావాలని కోరుతూ చేసిన పాదయాత్ర ఫలించిందని వైసీపీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై దాడి చేసే ప్రయత్నాన్ని విరమించుకుని పది రోజుల కాల్పుల విరమణ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ యుద్ధం ఒక ముగింపు రావాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు.</p>
<p>ప్రపంచంలో శాంతి నెలకొనేలా ప్రపంచ దేశాధినేతలు అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా జనరల్ సెక్రటరీ గనగల రామరాజు,వార్డ్ ప్రెసిడెంట్స్ పీతల వాసు, ముజీబ్ ఖాన్,జిల్లా RTI సెక్రెటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు బాబ్జి, దైవ కుమార్, వీటి కృష్ణ కుమార్, వార్డ్ యూత్ ప్రెసిడెంట్లు చేపల నూకరాజు బూరెల చిన్న, లోకేష్,ఉదయ్,మౌళి తదితరులు పాల్గున్నారు</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/vasupalli-ganesh-kumars-peace-walk-for-world-peace-145193</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:54:29 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/narayana-college-bobbili-faces-closure-parents-worried-145192</link>
<title><![CDATA[Bobbili: మధ్యలో వదిలేస్తే మా పిల్లల గతి ఏంటి.. తల్లిదండ్రుల ఆవేదన]]></title>
<description><![CDATA[Bobbili: బొబ్బిలి నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యం అద్దె బకాయిలు, నిర్వహణ ఖర్చులు సాకుగా చూపి విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపిస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది.]]></description>
<enclosure length="152412" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410959-bobbili-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410959-bobbili-.webp'/><figcaption><p>Bobbili: మధ్యలో వదిలేస్తే మా పిల్లల గతి ఏంటి.. తల్లిదండ్రుల ఆవేదన</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Bobbili:</b> బొబ్బిలిలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్లు (TC) ఇచ్చి పంపించనున్నట్లు యాజమాన్యం ప్రకటించడం కలకలం రేపుతోంది.</p>
<p>కాలేజ్ బిల్డింగ్ అద్దె చెల్లించలేకపోవడం, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటం వంటి కారణాలను చూపిస్తూ, "మీ పిల్లలకు TCలు ఇస్తాం. మీరు ఇతర కాలేజీల్లో చేర్పించుకోండి" అని తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సాలూరు కు చెందిన విద్యార్థులు,శశాంక్ (MPC) ఇంటర్ 1st ఇయర్ దిలీప్ కుమార్, (MPC) ఇంటర్ 1st ఇయర్,</p>
<p><b>తల్లిదండ్రులు మాట్లాడుతూ..</b></p>
<p>మా పిల్లలు ఇప్పటికే ఇంటర్ కోర్సులో చదువుతున్నారు. మధ్యలో ఇలా TCలు ఇస్తామని చెప్పడం చాలా అన్యాయమని మా పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందో భయపడుతున్నామని తమననా శ్రీనివాసరావు,బండి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ఈ ఘటనపై ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/narayana-college-bobbili-faces-closure-parents-worried-145192</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విజయనగరం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:46:15 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/national-workshop-on-state-income-statistics-starts-in-visakhapatnam-145191</link>
<title><![CDATA[Visakhapatnam: విశాఖలో రాష్ట్ర ఆదాయ గణాంకాల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం]]></title>
<description><![CDATA[Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో "రాష్ట్ర ఆదాయం మరియు సంబంధిత గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్" ప్రారంభమైంది.]]></description>
<enclosure length="89775" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410958-visakhapatnam-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410958-visakhapatnam-.webp'/><figcaption><p>Visakhapatnam: విశాఖలో రాష్ట్ర ఆదాయ గణాంకాల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Visakhapatnam:</b> రాష్ట్ర ఆదాయం గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్ విశాఖలో ప్రారంభించిన కేంద్ర గణాంకా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్, మన రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియుష్ కుమార్, రాష్ట్ర ఎకనామిక్స్ &స్థాటిస్టిక్స్ డైరెక్టర్ బి. గోపాల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు సుబ్రా సర్కార్, సిద్ధార్ద కుందూ తదితరులు</p>
<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక & గణాంకాల సంచాలకుల కార్యాలయం, ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో “నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం మరియు సంబంధిత గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్” బుధవారం విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో ప్రారంభమైంది.</p>
<p>ఈ వర్క్‌షాప్ ఏప్రిల్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గణాంక నిపుణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వం గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) పరిధిలోని నేషనల్ అకౌంట్స్ డివిజన్ (NAD), నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), న్యూ ఢిల్లీ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి.</p>
<p>నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం అంచనాలు, గణన విధానాలు, డేటా సమీకరణలో మార్పులు, సవరణలపై ఈ వర్క్‌షాప్‌లో సవివరంగా చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడం, గణాంకాల నాణ్యతను మెరుగుపరచడం ఈ వర్క్‌షాప్ ముఖ్య లక్ష్యాలుగా అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/national-workshop-on-state-income-statistics-starts-in-visakhapatnam-145191</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:37:48 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/mla-nimmaka-jayakrishna-reviews-water-security-in-palakonda-145189</link>
<title><![CDATA[Palakonda: మన రైతులకు నీరు అందాకే పక్క నియోజకవర్గాలకు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు]]></title>
<description><![CDATA[Palakonda: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 'నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని ప్రారంభించారు.]]></description>
<enclosure length="193697" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410956-palakonda-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410956-palakonda-.webp'/><figcaption><p>Palakonda: మన రైతులకు నీరు అందాకే పక్క నియోజకవర్గాలకు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Palakonda:</b> పాలకొండ మండల పరిషత్ ఆఫీస్ (ఎంపీడీఓ )ప్రాంగణం లో జల వనరుల శాఖ (నీటి భద్రత -సాగు నీటి సంఘాల భాధ్యత) అనే కార్యక్రమానికిని శ్రీ కారం చుట్టి నీటి సంఘాలు అధ్యక్షులు, మెంబెర్స్ తో సమావేశం అయిన పాలకొండ శాసన సభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు,</p>
<p><b>MLA నిమ్మక జయ క్రిష్ణ గారు మాట్లాడుతూ</b></p>
<p> నీటి భద్రత -సాగు నీటి సంఘాలు బాధ్యత 100 రోజులు ప్రోగ్రాం సందర్బంగా రైతులకు సంబంధించిన మధుములు,చెక్ డ్యామ్ లు, చెరువులు, సర్పల్స్ లు, డ్రాప్ లు ,సంబందించిన నియోజకవర్గం లో సదరు పనులను NREGS లో పూర్తి చేయాలనీ అధికారులును ఆదేశించారు.</p>
<p>సీతంపేట మండలం నకు సంబంధించిన నలినీ క్రిష్ణ సాగరం మరియు వీరఘట్టం మండలంలో వెంకన్న చెరువు ఆక్రమను గురై ఉన్న వాటిని క్లియర్ చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. అలాగే నీటి సంఘాలు అధ్యక్షులు సంగం ఆధ్వర్యంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.</p>
<p>పాలకొండ నియోజకవర్గం లో సాగు నీటి సమస్య భామిని మండలంలో వంశధార నాగావళి ప్రవాహం ఉన్న కూడా భామిని మండలానికి నీరు అందటం లేదు కనుక మా నియోజకవర్గం రైతుకి నీరు అందాకనే మిగతా వాళ్ళకి పంపించాలని అధికారులుకు ఆదేశించించారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/mla-nimmaka-jayakrishna-reviews-water-security-in-palakonda-145189</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,శ్రీకాకుళం]]></category>
<dc:creator><![CDATA[KAILASH SAHU, PALAKONDA]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:23:40 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/markapuram-brahmotsavam-bull-pulling-competition-starts-145184</link>
<title><![CDATA[Markapuram: మార్కాపురంలో భక్తి, ఉత్సాహం, గ్రామీణ సంప్రదాయాల సమ్మేళనం!]]></title>
<description><![CDATA[Markapuram: మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 రోజుల వేడుకల్లో ఎడ్ల బలప్రదర్శన పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి.]]></description>
<enclosure length="248324" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410950-markapuram-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410950-markapuram-.webp'/><figcaption><p>Markapuram: మార్కాపురంలో భక్తి, ఉత్సాహం, గ్రామీణ సంప్రదాయాల సమ్మేళనం!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Markapuram:</b> శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 16 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలు స్థానిక ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా మొదలయ్యాయి.</p>
<p>మొదటి రోజే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్న పోటీల్లో ఇవాళ ఆరుపల్ల సైజు ఎడ్లు బండలాగి తమ శక్తిని చాటాయి. ఎడ్ల ప్రతిభను తిలకించేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు.</p>
<p>ఈ పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. గెలుపొందిన ఎడ్లకు ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. సాంప్రదాయం, శక్తి, పోటీ స్పూర్తి—all in oneగా మారిన ఈ ఎడ్ల పోటీలు మార్కాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/markapuram-brahmotsavam-bull-pulling-competition-starts-145184</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 10:24:19 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/cm-chandrababu-naidu-reviews-roads-and-transport-sector-145182</link>
<title><![CDATA[Amaravati: ఏపీలో గుంతల రహిత రహదారులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!]]></title>
<description><![CDATA[Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు మరియు రవాణా శాఖలపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు.]]></description>
<enclosure length="149024" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410947-amaravati-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410947-amaravati-.webp'/><figcaption><p>Amaravati: ఏపీలో గుంతల రహిత రహదారులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Amaravati:</b> రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది అనే దృక్కోణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారులు & భవనాలు, రవాణాశాఖలపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్వహణ, పాత్‌హోల్ ఫ్రీ రోడ్లు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.</p>
<p>సమీక్షలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా పాత్‌హోల్ ఫ్రీ రోడ్లుగా మార్చడం అత్యవసరమని, ఇందుకోసం నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులకు సూచించారు. ప్రజలు రోజువారీ ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుండా రహదారులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>
<p>విభిన్న ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రహదారుల నిర్మాణం జరగాలని సీఎం సూచించారు. కొండప్రాంతాలు, తీరప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రాంతాలు వంటి భౌగోళిక భిన్నతలను అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా నాణ్యమైన రహదారులు నిర్మించాలని పేర్కొన్నారు. దీని ద్వారా రహదారుల నిలకడ పెరగడమే కాకుండా, మరమ్మతుల ఖర్చు కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.</p>
<p>మెరుగైన రహదారులు ప్రజలకు అందుబాటులో ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా నుంచి పరిశ్రమల అభివృద్ధి వరకు ప్రతి రంగానికి రహదారులు కీలకమని తెలిపారు. అందుకే రహదారుల నిర్మాణం, నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.</p>
<p>ఇక రవాణా రంగంలో ఆధునికతకు ప్రాధాన్యత ఇస్తూ, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజా రవాణాను అతి తక్కువ వ్యయంతో అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.</p>
<p>ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచేందుకు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని కూడా సీఎం సూచించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త విధానాలను అమలు చేయాలని చెప్పారు. రవాణా రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.</p>
<p>సమీక్షలో అధికారులు తమ తమ శాఖల పనితీరును వివరించారు. రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, నిధుల వినియోగం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.</p>
<p>ఈ సమీక్ష సమావేశం ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టమైంది. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు, అందుబాటులో ఉండే ప్రజా రవాణా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రహదారుల నాణ్యత, రవాణా సేవల మెరుగుదల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/cm-chandrababu-naidu-reviews-roads-and-transport-sector-145182</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,Andhra Pradesh Local,అమరావతి]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 10:06:47 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/world-health-day-celebrated-at-kurnool-nursing-college-145180</link>
<title><![CDATA[Kurnool: ఆరోగ్యం కోసం ఏకమవుదాం.. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం]]></title>
<description><![CDATA[Kurnool: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.]]></description>
<enclosure length="195143" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410945-kurnool-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410945-kurnool-.webp'/><figcaption><p>Kurnool: ఆరోగ్యం కోసం ఏకమవుదాం.. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం</p><span class='copyright'></span></figcaption></figure><p><b>కర్నూలు: </b>ప్రపంచ ఆరోగ్య దినోత్సవం* సందర్బంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ - సెట్కూరు ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజలను విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.</p>
<p>ఆరోగ్యం కోసం ఏకమవుదాం. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం” అనే ఇతివృత్తంతో, ఈ సంవత్సరం ప్రజలందరు జంతువులు, మొక్కలు మరియు భూగోళం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో శాస్త్రీయ సహకారానికిన్న శక్తిని చాటిచెప్పలాన్నారు. రక్తదానం, అవయవదానం లపై ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంపొందించి ప్రజలను చైతన్యవంతులను చేయవలెనని కోరారు.</p>
<p>ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.మంజుల గారు మాట్లాడుతూ ఆరోగ్యం మనకు అత్యంత ముఖ్యమైన విషయం అని నేడు చాలా మంది ప్రజలు జీవనశైలి, రకరకాల వ్యాధులు మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని . ప్రజలు తమ స్వీయ సంరక్షణ పద్ధతులను మరియు ఇతరుల సంరక్షణ పట్ల వారి విధానాలను మూల్యాంకనం చేసుకోవడానికి సహాయపడటానికే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉపయోగపడుతుందని తెలిపారు.</p>
<p>ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు వక్తృత్వ,వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశాంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులు మరియు సెట్కూరు సిబ్బంది వారు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల నోడల్ అధికారిణి వైడూర్యం మరియు NSS ప్రోగ్రామ్ అధికారిణి శ్రీదేవి సెట్కూరు సిబ్బంది శ్యామల, నిదీష్, శ్రీనివాస సింగ్ మొదలగువారు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhrapradesh/world-health-day-celebrated-at-kurnool-nursing-college-145180</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,కర్నూలు]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 10:06:34 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/collector-dr-a-siri-reviews-industrial-safety-in-kurnool-145178</link>
<title><![CDATA[Kurnool: ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి.. కలెక్టర్ ఆదేశం]]></title>
<description><![CDATA[Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీల భద్రతపై 'డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్' సమావేశం నిర్వహించారు.]]></description>
<enclosure length="161707" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410943-kurnool-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410943-kurnool-.webp'/><figcaption><p>Kurnool: ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి.. కలెక్టర్ ఆదేశం</p><span class='copyright'></span></figcaption></figure><p><b>కర్నూలు: </b> జిల్లాలో కర్మాగారాల్లో భద్రతకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కర్మాగారాల్లో చేపట్టాల్సిన భద్రత చర్యలపై సమీక్షించేందుకు ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు కచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కర్మాగారాల యాజమాన్యాల ప్రతినిధులను ఆదేశించారు. కర్మాగారాల్లో మాక్ డ్రిల్ లు తరచుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఫైర్,పోలీస్, రెవెన్యూ, వైద్య తదితర అత్యవసర విభాగాలు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీ లు ఇచ్చిన నివేదికల మేరకు భద్రతా చర్యలను చెక్ చేయాలని కలెక్టర్ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ను ఆదేశించారు.</p>
<p>డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సభ్యులు కూడా టీమ్ గా వెళ్ళి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే కర్మాగారాల్లో భద్రతా చర్యలను సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు..కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి , టోల్ ఫ్రీ నంబర్ తదితర వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలను ఆదేశించారు.</p>
<p>ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్‌ ఇన్‌ స్పెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లాలో ఉన్న కర్మాగారాల పరిస్థితి గురించి వివరించారు. టిజివి SRAAC లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL సంస్థల ప్రతినిధులు కర్మాగారాల్లో చేపట్టిన భద్రత చర్యల గురించి వివరించారు. సమావేశంలో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డీఎంహెచ్ వో కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కిషోర్ రెడ్డి, ఇతర సభ్యులు, వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/collector-dr-a-siri-reviews-industrial-safety-in-kurnool-145178</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,కర్నూలు]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 09:59:14 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/anantapur-mla-daggupati-prasad-surprise-visit-to-secretariat-145176</link>
<title><![CDATA[Anantapur: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. సచివాలయంలో ముగ్గురే ఉండటంతో సీరియస్!]]></title>
<description><![CDATA[Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలోని 74వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.]]></description>
<enclosure length="107372" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410941-anantapur-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410941-anantapur-.webp'/><figcaption><p>Anantapur: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. సచివాలయంలో ముగ్గురే ఉండటంతో సీరియస్!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Anantapur:</b> అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని 74వ సచివాలయాన్ని ఆయన అకస్మాత్తుగా సందర్శించారు.</p>
<p>ఎమ్మెల్యే సచివాలయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉండాల్సిన 10 మంది సిబ్బందిలో కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో కనిపించడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. మిగతా సిబ్బంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నించగా నలుగురు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారని మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వెంటనే ఫీల్డ్‌లో ఉన్న సిబ్బందికి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి వారు ఏ పనుల కోసం వెళ్లారో వివరాలు తెలుసుకున్నారు.</p>
<p>అనంతరం సచివాలయంలో హాజరు శాతం పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదుల వివరాలను పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని, వాటిలో ఎన్ని పరిష్కరించారన్న అంశాలపై కూలంకషంగా సమీక్ష నిర్వహించారు.</p>
<p>సచివాలయ సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/anantapur-mla-daggupati-prasad-surprise-visit-to-secretariat-145176</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,అనంతపురం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 09:36:01 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/marripadu-si-seizes-chicken-waste-bolero-vehicle-145173</link>
<title><![CDATA[Marripadu: కోళ్ల వ్యర్థాల వాహనంపై ఎస్సై పంజా]]></title>
<description><![CDATA[Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాలను ఎస్సై కాసులు శ్రీనివాసరావు పట్టుకున్నారు.]]></description>
<enclosure length="137956" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410938-marripadu-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410938-marripadu-.webp'/><figcaption><p>Marripadu: కోళ్ల వ్యర్థాల వాహనంపై ఎస్సై పంజా</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Marripadu:</b> కోళ్ల వ్యర్థాలను ఆహారంగా వేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి బొలెరో వాహనంలో తరలిస్తున్న సమాచారంతో మర్రిపాడు ఎస్ఐ కాసులు శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి చుంచులూరు జాతీయ రహదారిపై కాపు కాసి పంజా విసిరారు 15 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలను స్వాధీనం చేసుకొని యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. </p>
<p>పట్టుకున్న వ్యర్థాలను జెసిబితో గుంతలు తవ్వించి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఊరి బయట పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కర్ణాటక నుంచి చికెన్ వ్యర్థాలను ఆంధ్రకు తరలించడం చట్టరీత్య నేరమని ఆ వ్యర్ధాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పుందని అలాగే వెనక వచ్చే వాహన దారులకు మరియు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు.</p>
<p> ప్రజల ప్రాణాలకు భద్రత ఆరోగ్య రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పై ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చుంచులూరు ఇన్చార్జి, విఆర్డీ మరియు వీఆర్ఎ, పోలీస్ సిబ్బంది పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/marripadu-si-seizes-chicken-waste-bolero-vehicle-145173</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 09:21:13 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/murder-for-gold-nephew-kills-elderly-aunt-in-cheepurupalli-145171</link>
<title><![CDATA[Cheepurupalli: రెండు తులాల బంగారం కోసం ఘాతుకం]]></title>
<description><![CDATA[Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెంలో దారుణం జరిగింది. రెండు తులాల బంగారం కోసం మేనత్తను హత్య చేసి, చెరువులో పాతిపెట్టిన మేనల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు.]]></description>
<enclosure length="333698" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410936-cheepurupalli-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410936-cheepurupalli-.webp'/><figcaption><p>Cheepurupalli: రెండు తులాల బంగారం కోసం ఘాతుకం</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Cheepurupalli: </b>చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామం నకు చెందిన గొర్లె చిన్నప్పమ్మ (68) అనే వృద్ధురాలు ని రెండు తులాల బంగారం కోసం సొంత మేనల్లుడే హత్య చేసి ఊరు చివర్లో గల చెరువులో పాతిపెట్టిన ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. </p>
<p>చీపురుపల్లి డి.ఎస్.పి.ఎస్ రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శంకర్రావు ల సారధ్యంలో ఈ సంఘటనకు సంబంధించి వివరించిన విషయాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు చిన్నప్పమ్మ ఫిబ్రవరి నెల 23న ఇంటి నుండి కనబడకుండా పోయినట్లు ఆమె కుమార్తె అల్లుడు రెడ్డి పాపినాయుడులు ఫిబ్రవరి 27న చీపురుపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.</p>
<p>ఫిబ్రవరి 23 నుండి కనబడకుండా పోయిన చిన్నప్పమ్మను బంధువుల , తెలిసిన కుటుంబాల వద్ద ఆ నెల 26 వరకు వెతక సాగారు. ఈ క్రమంలో మృతురాలు సొంత మేనల్లుడైన యెజ్జిపురపు రమణ, అదే గ్రామానికి చెందిన చందక రమన కదలికల పైన గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులు ఆఫీసులో దర్యాప్తును కొనసాగించారు.</p>
<p>దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా తామే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో మంగళవారం నాడు నిందితులతో పాటు శవాన్ని పాతిపెట్టిన స్థలానికి పోలీస్, అధికారులు, రెవెన్యూ, క్లూస్ బృందం తో పాటు ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ పోలీస్ లేబరేటరీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.</p>
<p>బంధువుల సమక్షంలో మృతురాలని గుర్తించి హత్యా నేరముగా పరిగణించారు. పోలీసుల కథనం మేరకు ఫిబ్రవరి 23న మృతురాలిని ఇంటిలోనే సొంత మేనల్లుడైన యెజ్జిపురపు రమణ, చందకర రమణ ఇద్దరు కలిసి మృతురాల్ని హత్య చేసి ఫ్లెక్సీల కవర్లో చుట్టి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల చెరువులో పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. </p>
<p>తమకున్న సమాచారం మేరకు ఇద్దరు నిందితులను కూడా రణస్థలం వద్ద అరెస్టు చేశామని సిఐ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు నిందితులు దొంగిలించిన బంగారం తో పాటు, వారికి ఎవరెవరు సహకరించారు అనే అంశం పైన కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వ్యసనాలకు అలవాటు పడి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు.</p>
<p>ఈ మేరకు సీఐ శంకర్రావు ఆధ్వర్యంలో చీపురుపల్లి ఎస్సై దామోదర్ రావు, గరివిడి ఎస్సై లోకేష్, బుధ రాయవలసి ఎస్ఐ లోకేష్, గుర్ల ఎస్ఐ నారాయణరావు, పోలీస్ సిబ్బంది స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ డి ధర్మరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/murder-for-gold-nephew-kills-elderly-aunt-in-cheepurupalli-145171</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విజయనగరం]]></category>
<dc:creator><![CDATA[Sai Potluri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 09:14:18 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/minister-nara-lokesh-praja-darbar-day-87-addressing-public-issues-145165</link>
<title><![CDATA[Nara Lokesh: ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్]]></title>
<description><![CDATA[Nara Lokesh: మంగళగిరిలో 87వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ 'ప్రజాదర్బార్'. లోకో పైలట్లు, ఏఎన్‌యూ ఉద్యోగులు, హైర్ బస్ యజమానుల సమస్యలపై మంత్రి సానుకూల స్పందన.]]></description>
<enclosure length="160095" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410930-nara-lokesh-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410930-nara-lokesh-.webp'/><figcaption><p>Nara Lokesh: ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nara Lokesh: </b>ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి మరో ఉదాహరణగా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 87వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలను మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని భరోసా కల్పిస్తున్నారు.</p>
<p>ఈ ప్రజాదర్బార్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుతో సంబంధం ఉన్న సమస్యలు చర్చకు వచ్చాయి. విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా అక్కడే కొనసాగించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. డిపోను ఇతర ప్రాంతాలకు మార్చే యోచనల వల్ల సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వారు తెలిపారు. ఈ అంశాన్ని మంత్రి గంభీరంగా పరిగణించి సంబంధిత అధికారులతో చర్చించి న్యాయం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.</p>
<p>అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగుల సమస్యలు కూడా ప్రజాదర్బార్‌లో ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని యూనియన్ ప్రతినిధులు కోరగా, వారి పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.</p>
<p>కోవిడ్ మహమ్మారి సమయంలో తీవ్ర నష్టాలను చవిచూసిన హైర్ బస్ యజమానులు కూడా తమ సమస్యలను మంత్రి ముందుంచారు. బస్సుల రీప్లేస్‌మెంట్‌కు సహాయం అందించాలని వారు కోరగా, ప్రభుత్వం వీలైనంత వరకు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తుందని మంత్రి తెలిపారు.</p>
<p>ఇక భూవివాదాలు వంటి వ్యక్తిగత సమస్యలు కూడా ప్రజాదర్బార్‌లో ప్రస్తావనకు వచ్చాయి. నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామానికి చెందిన ఒక మహిళ తన వంశపారంపర్య భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేయగా, దానిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.</p>
<p>ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా తన వ్యక్తిగత కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజాదర్బార్ ద్వారా ప్రతి సమస్యను వినిపించే అవకాశం కల్పిస్తూ, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.</p>
<p>ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజలతో ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ, సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.</p>
<p></p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/minister-nara-lokesh-praja-darbar-day-87-addressing-public-issues-145165</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:17:50 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/amaravathi/minister-gottipati-ravi-kumar-opens-new-apcpdcl-corporate-office-in-amaravati-145161</link>
<title><![CDATA[Amaravati: పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలతో రైతులకు లబ్ధి: విద్యుత్ శాఖ మంత్రి]]></title>
<description><![CDATA[Amaravati: అమరావతిలో రూ. 30 కోట్లతో నిర్మించిన APCPDCL నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.]]></description>
<enclosure length="108017" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410926-amaravati-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410926-amaravati-.webp'/><figcaption><p>Amaravati: పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలతో రైతులకు లబ్ధి: విద్యుత్ శాఖ మంత్రి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Amaravati:</b> రాష్ట్ర విద్యుత్ రంగంలో మౌలిక వసతుల బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. అమరావతిలో APCPDCL నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక కార్యాలయం, విద్యుత్ సేవల నిర్వహణలో మరింత సమర్థతను తీసుకురానుందని అధికారులు భావిస్తున్నారు..</p>
<p>ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి మంచి పేరు రావడానికి ఉద్యోగుల అహర్నిశల శ్రమే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కష్టకాలాల్లో కూడా వెనుకడుగు వేయకుండా విధులు నిర్వర్తించే విద్యుత్ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు..</p>
<p>ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరుగుతోందని, రైతులు మరియు గృహ వినియోగదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాష్ట్రంలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. </p>
<p>వరదలు వంటి విపత్తుల సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఉద్యోగులు చూపిన అంకితభావాన్ని మంత్రి ప్రత్యేకంగా గుర్తించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేసి ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు వారు చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజల అవసరాలను ముందుంచుకుని పనిచేసే విద్యుత్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. </p>
<p>ఇక రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో రాష్ట్రం రికార్డు స్థాయిని నమోదు చేస్తోందని పేర్కొన్నారు..</p>
<p>లో ఓల్టేజి సమస్యలను పూర్తిగా నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని మంత్రి వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు..</p>
<p>కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖపై ప్రజల్లో సంతృప్తి స్థాయి గణనీయంగా పెరిగిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం ద్వారా విద్యుత్ సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని, భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/amaravathi/minister-gottipati-ravi-kumar-opens-new-apcpdcl-corporate-office-in-amaravati-145161</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,అమరావతి]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 11:19:15 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/just-in/marripadu-tahsildar-anil-kumar-reviews-household-survey-2027-145155</link>
<title><![CDATA[Nellore: మే నెలలో గృహాల గణన తహసీల్దార్ సమీక్ష]]></title>
<description><![CDATA[Nellore: మర్రిపాడు మండలంలో మే 1 నుంచి గృహాల గణన సర్వే ప్రారంభం. గణాంకులకు, పర్యవేక్షకులకు నందవరం ఆదర్శ పాఠశాలలో శిక్షణ.]]></description>
<enclosure length="236900" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410919-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410919-nellore-.webp'/><figcaption><p>Nellore: మే నెలలో గృహాల గణన తహసీల్దార్ సమీక్ష</p><span class='copyright'></span></figcaption></figure><p><b>మర్రిపాడు: </b>గృహాల గణన పై ప్రభుత్వం 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వే కార్యక్రమాన్ని మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని అధికారులకు ఆయన సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గణంకులకు, పర్యవేక్షకులకు బ్యాచీల వారీగా నందవరం ఆదర్శ పాఠశాలలో మూడు రోజులపాటు మొదటి బ్యాచ్ కు 9వతేదీ నుంచి 11వ తేదీ వరకు రెండో బ్యాచ్లు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు,మూడవ బ్యాచ్ కు 21వ తేది నుంచి 23వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గృహాల సర్వేకు వచ్చిన గణాంకులకు.. గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు సహకరించి వారికి ఇచ్చిన గుర్తింపు కార్డులను, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఇంచార్జ్ తహసీల్దార్ కోరారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/just-in/marripadu-tahsildar-anil-kumar-reviews-household-survey-2027-145155</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 07:32:34 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/just-in/lok-satta-president-bhisetti-babji-urges-cm-chandrababu-to-relaunch-chandranna-bima-scheme-145153</link>
<title><![CDATA[Vijayawada: మట్టి ఖర్చులకూ దిక్కులేదు.. బీమా పునరుద్ధరించండి!]]></title>
<description><![CDATA[Vijayawada: రాష్ట్రంలో 'చంద్రన్న బీమా' పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి విజ్ఞప్తి.]]></description>
<enclosure length="183626" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410917-vijayawada-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410917-vijayawada-.webp'/><figcaption><p>Vijayawada: మట్టి ఖర్చులకూ దిక్కులేదు.. బీమా పునరుద్ధరించండి!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>విజయవాడ:</b> ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాసిన లేఖను విధుల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని 2017 నుండి 2019 వరకూ రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలకు పైగా ప్రభుత్వం నుండి అత్యవసర ఆర్ధిక సహాయం అందిందని 2017 అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకంలో వైట్ కార్డు హోల్డర్ కుటుంబాల్లో ఉన్న 18 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు సాధారణంగా మరణిస్తే 2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం చెందితే 2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షలు, 51 నుండి 60 సంవత్సరాల వయసు వారు సాధారణంగా మరణిస్తే 30 వేలు ప్రమాద బీమా, 61 నుండి 70 సంవత్సరాల వయస్సు వారు సాధారణంగా మరణిస్తే ఏమి ఇవ్వనప్పటికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చులు అందించేవారని గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో ఆంక్షలతో యూనివర్సల్ సంపూ ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినవారు పాముకాటు తోగాని ప్రమాదంలోగాని పిడుగుపాటుతో గాని దురదృష్టవశాత్తు చనిపోతే మట్టికర్చులకు డబ్బులు లేక లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చంద్రన్న బీమా వంటి గొప్ప సహాయం పేదలకు మరేమీ ఉండదని వెంటనే పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని భీశెట్టి కోరారు ఈ సమావేశంలో లోక్ సత్తా నాయకులు బొర్రా శ్రీను,బావిశెట్టి సతీష్,తుమ్మల కృష్ణారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/just-in/lok-satta-president-bhisetti-babji-urges-cm-chandrababu-to-relaunch-chandranna-bima-scheme-145153</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విజయవాడ]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 07:27:29 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/vijayawada-and-tirupati-to-become-greater-cities-145152</link>
<title><![CDATA[Vijayawada: విజయవాడ, తిరుపతి ఇక 'గ్రేటర్'!]]></title>
<description><![CDATA[Vijayawada: విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే 'గ్రేటర్' నగరాలుగా మారుస్తామని మంత్రి నారాయణ వెల్లడి. విజయవాడ శివార్లలో రూ. 105 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన.]]></description>
<enclosure length="149745" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410916-vijayawada-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410916-vijayawada-.webp'/><figcaption><p>Vijayawada: విజయవాడ, తిరుపతి ఇక 'గ్రేటర్'!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vijayawada:</b> విజయవాడ శివార్లలో 105 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ.. నగరాల అభివృద్ధికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని, తాడిగడపలో అభివృద్ధి పనుల జోరు మొదలైందని చెప్పారు.. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో మంత్రి నారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 105 కోట్లతో మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు, తాడిగడప సనత్ నగర్‌లో 2.75 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు.</p>
<p><b>ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..</b></p>
<p>విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే గ్రేటర్ నగరాలుగా మారుస్తామని, జనగణన పూర్తి కాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణమే 7 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ఆయన, గత ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడం వల్లే రాష్ట్రంలో మౌలిక వసతుల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29 వేల కోట్లు అవసరమని, ప్రస్తుతం ప్రజలకు తాగునీరు, డ్రెయిన్ల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/vijayawada-and-tirupati-to-become-greater-cities-145152</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విజయవాడ]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 07:20:17 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/just-in/mla-somireddy-distributes-rs-75-lakh-cmrf-checks-in-survepalli-145147</link>
<title><![CDATA[Nellore: నెలకు రూ.100 కోట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలనం!]]></title>
<description><![CDATA[Nellore: సర్వేపల్లి నియోజకవర్గంలో 57 మంది బాధితులకు రూ.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.]]></description>
<enclosure length="271015" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410911-nellore-100-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410911-nellore-100-.webp'/><figcaption><p>Nellore: నెలకు రూ.100 కోట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలనం!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore: </b>సర్వేపల్లిలో 57 మందికి రూ.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి...</p>
<p>నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..</p>
<p>కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 760 మందికి రూ.7.22 కోట్లు సాయం అందించామని చెప్పారు..</p>
<p>ఎన్ని దరఖాస్తులు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా స్పందిస్తున్నారని, </p>
<p>రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా రూ.100 కోట్ల చొప్పున పేదలకు సాయం అందుతోందని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి.</p>
<p> ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాదిమంది పేదలు సాయం పొందుతున్నారని ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో సాయం చేసిన పరిస్థితులు లేవని చెప్పారు... కొందరు కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం అని, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ , యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, పేదలకు మరింత దగ్గర అవుతుందని ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షం, కావాలని తాము చేస్తున్న అభివృద్ధిపై బురద చల్లాలని చూస్తుందని చెప్పారు.</p>
<p>ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందరం రుణపడివున్నాం అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/just-in/mla-somireddy-distributes-rs-75-lakh-cmrf-checks-in-survepalli-145147</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 07:04:36 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/president-recommends-rajya-sabha-mp-beeda-masthan-raos-fishermen-bill-145144</link>
<title><![CDATA[Beeda Masthan Rao: మత్స్యకార బిల్లుకు రాష్ట్రపతి ఓకే!]]></title>
<description><![CDATA[Beeda Masthan Rao: దేశవ్యాప్త మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ ప్రవేశపెట్టిన 'నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్‌మెన్ బిల్, 2025' కు భారత రాష్ట్రపతి సిఫార్సు.]]></description>
<enclosure length="103505" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410908-beeda-masthan-rao-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410908-beeda-masthan-rao-.webp'/><figcaption><p>Beeda Masthan Rao: మత్స్యకార బిల్లుకు రాష్ట్రపతి ఓకే!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Beeda Masthan Rao:</b> దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం, భద్రత, అభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ప్రవేశపెట్టిన “నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్‌మెన్ (వెల్ఫేర్ అండ్ సపోర్ట్) బిల్, 2025” కు భారత రాష్ట్రపతి సిఫార్సు లభించడం ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన ముందడుగని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు.</p>
<p>ఈ బిల్లును తాను 2026 ఫిబ్రవరి 6న రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లు, దానికి సంబంధించి భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని Article 117(3) ప్రకారం పరిశీలనకు సిఫార్సు చేసినట్లు రాజ్యసభ కార్యదర్శిత్వం నుంచి అధికారిక సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.</p>
<p>దేశంలో కోట్లాది మంది మత్స్యకార కుటుంబాలు సముద్రం, చెరువులు, నదులు, జలాశయాలపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, వారి సమస్యలు, సంక్షేమం, భద్రత, జీవనోపాధి, మార్కెటింగ్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పిల్లల విద్య, మహిళల ఉపాధి, వృత్తి ఆధునీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే ఒక జాతీయ స్థాయి స్వతంత్ర కమిషన్ అవసరం ఎంతోకాలంగా ఉందని బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు.</p>
<p>ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా National Commission for Fishermen ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలను కేవలం రాష్ట్రాల పరిధిలోనే కాకుండా జాతీయ విధాన స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.</p>
<p>రాష్ట్రపతి సిఫార్సు లభించడం ద్వారా ఈ బిల్లుకు పార్లమెంటరీ ప్రాసెస్‌లో ఒక గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని, ఇది దేశవ్యాప్తంగా మత్స్యకార సమాజానికి ఒక ఆశాకిరణం అని ఎంపీ పేర్కొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు, వృత్తి పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p>దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకార సంఘాలు, వృత్తిదారులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని, మత్స్యకారుల హక్కుల కోసం తాను పార్లమెంట్ వేదికగా నిరంతరం పోరాడుతూనే ఉంటానని బీద మస్తాన్ రావు యాదవ్ స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/president-recommends-rajya-sabha-mp-beeda-masthan-raos-fishermen-bill-145144</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 06:58:45 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/rk-roja-personal-health-secrets-ex-minister-reveals-why-she-got-bp-and-sugar-after-entering-politics-145141</link>
<title><![CDATA[RK Roja: రాజకీయాల వల్ల బీపీ, షుగర్ వచ్చాయి.. రోజా సంచలన వ్యాఖ్యలు!]]></title>
<description><![CDATA[RK Roja: రాజకీయాల్లోకి వచ్చాక తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.]]></description>
<enclosure length="132535" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410906-rk-roja-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410906-rk-roja-.webp'/><figcaption><p>RK Roja: రాజకీయాల వల్ల బీపీ, షుగర్ వచ్చాయి.. రోజా సంచలన వ్యాఖ్యలు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>RK Roja:</b> వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులు మరియు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరిలోని తన నివాసంలో పదవీకాలం ముగిసిన వైసీపీ సర్పంచ్‌లను సన్మానించిన సందర్భంగా ఆమె మనసు విప్పి మాట్లాడారు.</p>
<p><b>రాజకీయ ఒత్తిడి.. అనారోగ్య సమస్యలు</b></p>
<p>రాజకీయాలు అంటేనే అంతులేని మానసిక ఒత్తిడితో కూడుకున్నవని రోజా పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ.. "నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య బారిన పడ్డాను. ఇక రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ వచ్చింది" అని ఆమె వెల్లడించారు. ప్రజా సేవలో నిరంతరం ఒత్తిడికి లోనవ్వడం వల్లే ఈ ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు.</p>
<p><b>కూటమి నేతల్లా అబద్ధాలు చెప్పలేకపోయాం!</b></p>
<p>గత ఎన్నికల ఓటమిపై స్పందిస్తూ, తాము ప్రజలకు అబద్ధాలు చెప్పలేకపోయామని రోజా వ్యాఖ్యానించారు. "చంద్రబాబు కూటమి నేతల్లా మేం అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాం. అందుకే ఓటమి పాలయ్యాం. కానీ జగన్ పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాం" అని ఆమె స్పష్టం చేశారు. అబద్ధాలతో గెలిచిన వారికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.</p>
<p><b>సర్పంచ్‌లకు పిలుపు.. స్థానిక సంస్థలే లక్ష్యం</b></p>
<p>వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లోకి వెళ్లేలా తాము అభివృద్ధి పనులు చేశామని రోజా కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని, మళ్ళీ వైసీపీ విజయకేతనం ఎగురవేయాలని ఆమె కేడర్‌కు పిలుపునిచ్చారు. ప్రజాబలమే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/rk-roja-personal-health-secrets-ex-minister-reveals-why-she-got-bp-and-sugar-after-entering-politics-145141</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Arun Chilukuri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 06:49:05 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/srikakulam/patapatnam-mla-mamidi-govinda-rao-meets-cm-chandrababu-naidu-145137</link>
<title><![CDATA[Srikakulam: పాతపట్నానికి పాలిటెక్నిక్ కళాశాల? సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి]]></title>
<description><![CDATA[Srikakulam: పాతపట్నం నియోజకవర్గ పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నివేదిక.]]></description>
<enclosure length="163868" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410900-srikakulam-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410900-srikakulam-.webp'/><figcaption><p>Srikakulam: పాతపట్నానికి పాలిటెక్నిక్ కళాశాల? సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>పాతపట్నం:</b> పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దశాబ్దాల పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి పెట్టారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సమస్యల నివేదికను అందజేశారు. పాతపట్నం నియోజకవర్గంలో పలు గ్రామాలు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేలా సీది, కోసమల, మజ్జిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల) పథకాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. </p>
<p>ప్రస్తుతం ఉన్న 50 పడకల పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. దీనివల్ల 75 గ్రామాలకు చెందిన సుమారు 90 వేల మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎంకు వివరించారు. నియోజకవర్గ యువతకు సాంకేతిక విద్యను అందించేందుకు కొత్తగా పాలిటెక్నిక్ మరియు ఐటిఐ (ITI) కళాశాలల ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇందుకోసం 3 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, 180 సీట్ల సామర్థ్యం గల పాలిటెక్నిక్ కళాశాల పాతపట్నం నియోజకవర్గానికి కావాలని ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యే పెండింగ్ లో ఉన్న పరిహారం, ఇళ్ల స్థలాల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని కోరారు. గతంలో నిర్వాసితులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. </p>
<p>వంశధార రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. భగీరథపురం నుండి హిరమండలం ఎంపీడీవో ఆఫీస్ వరకు నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి విజ్ఞప్తి చేశారు. మెలియాపుట్టిలో ఐటిడిఏ (ITDA) కార్యకలాపాలను బలోపేతం చేసి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ అందజేసిన నివేదికపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి, ప్రాజెక్టులకు త్వరితగతిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియాకు తెలిపారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/srikakulam/patapatnam-mla-mamidi-govinda-rao-meets-cm-chandrababu-naidu-145137</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,శ్రీకాకుళం]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 06:38:07 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/macherla-lady-employee-rape-case-mystery-solved-boyfriend-arrested-for-brutal-assault-145122</link>
<title><![CDATA[Macherla: మాచర్ల అత్యాచార కేసులో ట్విస్ట్.. నిందితుడు ప్రియుడే!]]></title>
<description><![CDATA[Macherla: మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అమానుష దాడి కేసులో కీలక మలుపు. గుర్తుతెలియని వ్యక్తి అని నమ్మించిన బాధితురాలు.. చివరకు వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నిందితుడు ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు.]]></description>
<enclosure length="70945" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410881-macherla-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410881-macherla-.webp'/><figcaption><p>Macherla: మాచర్ల అత్యాచార కేసులో ట్విస్ట్.. నిందితుడు ప్రియుడే!</p><span class='copyright'></span></figcaption></figure><p>పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అమానుష అత్యాచారం మరియు హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి దాడి చేశాడని భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలికి అత్యంత సన్నిహితుడైన ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.</p>
<p><b>ఘటన నేపథ్యం</b></p>
<p>ఈ నెల ఈస్టర్ పండుగ ముందు రోజు సత్తెనపల్లి వెళ్లేందుకు సిద్ధమైన సదరు మహిళపై నిందితుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. మంచినీళ్ల సాకుతో ఇంట్లోకి చొరబడి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. కాళ్లు చేతులు కట్టేసి, వివస్త్రను చేసి జననాంగంపై ఇనుప చువ్వతో దాడి చేశాడు. ఆమె కుమారుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి స్నేహితులను పంపగా, రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని చూసి వారు పోలీసులకు సమాచారం అందించారు.</p>
<p><b>పోలీసుల దర్యాప్తు - సాంకేతిక ఆధారాలు</b></p>
<p>మొదట బాధితురాలు కూడా గుర్తుతెలియని వ్యక్తి అని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే, ఘటనా స్థలంలో ఉన్న మద్యం బాటిళ్లు, భోజనం పార్శిళ్లను చూసిన పోలీసులకు ఇది తెలిసిన వారి పనేనని అనుమానం వచ్చింది. సిసి టీవీ ఫుటేజీలో ఆధారాలు లభించకపోవడంతో, పోలీసులు బాధితురాలి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ డేటా (WhatsApp Data) రిట్రీవ్ చేశారు. ఈ క్రమంలో రాజుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో ఆమె జరిపిన చాటింగ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.</p>
<p><b>నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్</b></p>
<p>పోలీసుల విచారణలో శ్రీనివాస్ తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆమెపై అంత వికృతంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి కోలుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే అతడిని రిమాండ్‌కు తరలించనున్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/macherla-lady-employee-rape-case-mystery-solved-boyfriend-arrested-for-brutal-assault-145122</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Arun Chilukuri]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 05:38:05 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/rs-15-lakh-worth-medicines-gutted-in-fire-east-godavari-145120</link>
<title><![CDATA[East Godavari: ఆసుపత్రిలో అగ్నికీలలు.. మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ మ్యాన్ అస్వస్థత]]></title>
<description><![CDATA[East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. మెడిసిన్ స్టోర్ రూమ్‌లో చెలరేగిన మంటలు. రూ. 15 లక్షల విలువైన మందులు దగ్ధం.]]></description>
<enclosure length="118429" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410879-east-godavari-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410879-east-godavari-.webp'/><figcaption><p>East Godavari: ఆసుపత్రిలో అగ్నికీలలు.. మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ మ్యాన్ అస్వస్థత</p><span class='copyright'></span></figcaption></figure><p><b>తూర్పు గోదావరి జిల్లా:</b> నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి)లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి మెడిసిన్ స్టోర్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.</p>
<p> మొదట ఫైర్ గన్స్ ఉపయోగించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, స్టోర్‌లో ఉన్న ఔషధ సీసాలు ఒక్కొక్కటిగా పేలడంతో మంటలు మరింతగా చెలరేగాయి.</p>
<p>సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. మంటలు ఆర్పే క్రమంలో ఔషధ సీసాలు పేలిపోవడంతో ఒక ఫైర్ మ్యాన్ స్పృహ తప్పి కిందపడినట్లు సమాచారం. వెంటనే అతనికి వైద్య సహాయం అందించారు.</p>
<p>ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటీవల మందుల కొరత నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చిన ప్రత్యేక ఔషధాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం సుమారు రూ.15 లక్షల విలువైన మెడిసిన్ కాలిబూడిదైనట్లు అధికారులు తెలిపారు. </p>
<p>అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో పేషెంట్లు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/rs-15-lakh-worth-medicines-gutted-in-fire-east-godavari-145120</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 05:29:15 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/kadapa/sp-siddharth-ips-warns-rowdy-sheeters-after-midnight-raid-145115</link>
<title><![CDATA[Kadapa: కడపలో ఎస్పీ 'సింగం' అవతారం.. అర్ధరాత్రి రౌడీల గుండెల్లో రైళ్లు!]]></title>
<description><![CDATA[Kadapa: కడప నగరంలో అర్ధరాత్రి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్. ఆలంఖాన్ పల్లి, అల్మాస్ పేటలో తనిఖీలు. 30 వాహనాలు, కత్తి స్వాధీనం.]]></description>
<enclosure length="215580" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410875-kadapa-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410875-kadapa-.webp'/><figcaption><p>Kadapa: కడపలో ఎస్పీ 'సింగం' అవతారం.. అర్ధరాత్రి రౌడీల గుండెల్లో రైళ్లు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>వై.ఎస్.ఆర్ కడప జిల్లా: </b>జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి నేతృత్వంలో పోలీసు బలగాలతో అర్ధరాత్రి కడప నగరంలోని ఆలంఖాన్ పల్లి , అల్మాస్ పేట, మాసాపేట లలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలు, కత్తి స్వాధీనం జిల్లాలో రౌడీయిజానికి తావులేదు.. కడప నగరంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్.పీ గారు. రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకుంటాం ..జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు.</p>
<p>కడప శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ నేతృత్వంలో పోలీస్ బలగాలతో మంగళవారం రాత్రి నుండి అర్ధరాత్రి వరకూ కడప నగరంలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి పలువురు అనుమానితుల, పాత నేరస్థుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలంఖాన్ పల్లి లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్ పేట సర్కిల్ వద్ద నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా ఎస్.పీ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రౌడీ యిజానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. </p>
<p>ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరుగుతూ న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో రౌడీయిజానికి తావులేదని ఎస్.పీ తెలిపారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల బద్వేలు, కమలాపురం లలో గంజాయి బ్యాచ్ లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్.పీ వివరించారు. నగరంలో నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్, అర్ధరాత్రి వాహన తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలను, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ లో ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విబుకృష్ణ ఐ.పీ.ఎస్ గారు, స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ శ్రీ ఎన్ .సుధాకర్ గారు, మైదుకూరు డీ.ఎస్.పీ రాజేంద్రప్రసాద్ గారు, కడప నగరంలోని సి.ఐ లు, జిల్లాలోని సి.ఐ లు, ఎస్.ఐ లు , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/kadapa/sp-siddharth-ips-warns-rowdy-sheeters-after-midnight-raid-145115</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,కడప (వైఎస్సార్ కడప)]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 05:18:40 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/nellore/the-master-of-ekadhara-string-art-and-world-record-holder-145108</link>
<title><![CDATA[Nellore: అద్భుత 'సూత్రకళ'.. గిన్నిస్ రేసులో నెల్లూరు ఉపాధ్యాయుడు!]]></title>
<description><![CDATA[Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య అద్భుత సృష్టి. దారంతో కళారూపాలను రూపొందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రేసులో నిలిచారు.]]></description>
<enclosure length="117910" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410867-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/08/410867-nellore-.webp'/><figcaption><p>Nellore: అద్భుత 'సూత్రకళ'.. గిన్నిస్ రేసులో నెల్లూరు ఉపాధ్యాయుడు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore:</b> ఆయన చేతులు నల్లటి బోర్డు మీద తెల్లని అక్షరాలను మాత్రమే కాదు.. ఆ చేతులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. రికార్డులు బద్దలు కొడుతున్నాడు.. అలాగని ఆయనేం ఒలంపిక్స్ క్రీడాకారుడు కాదు.. కేవలం ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మాత్రమే.. మన భాషలో చెప్పాలంటే ఓ బడిపంతులు.. ఆయన చేసే అద్భుతాలు చూసి బడిలోని పిల్లలే కాదు యావత్ ప్రపంచమే నివ్వెర పోతుంది..</p>
<p>పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా ..సమయం దొరికిన సందర్భాలలో చదువుతో పాటుగా, పిల్లలకు భారతదేశంలో ఎక్కడా చూడనటువంటి కళారూపాలను, దారంతోటి ఎలా చేయాలో నేర్పిస్తు మెట్ట ప్రాంతం నుండి వచ్చాడని చిన్న చూపు చూసిన వారందరూ.. ఇప్పుడు విజ్ఞానంలో ఆయన దిట్ట అంటూ... గ్రామస్తులతో పాటు, తను విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రాంతం వాసులు కూడా మెచ్చుకునేలా ముందుకు సాగుతున్నాడు.. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాల్టీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ , ఇలా పలు అవార్డులు అందుకుని మరలా , గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు... ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు.. ఆయన చేసే విశేషాలు ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి సూత్రకళ నైపుణ్యం అంటారు.. ఇంతకీ ఏమిటా సూత్రకళ ? ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా..? ఆయన చేత్తో దారం పట్టుకుంటే చాలు , అద్భుత చిత్రాలు రూపుదిద్దుకుంటాయి . దేవతామూర్తులు,రాజులు, రాజకీయ నాయకుల చిత్రాలను దారంతో తయారు చేసే కళానైపుణ్యంలో ఆయనది అందెవేసిన చేయి.</p>
<p>అయితే ఎలా తయారు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదివేయండి మీ హెచ్ఎంటీవీ యాప్ లో..</p>
<p>నెల్లూరు జిల్లాలో నెల్లూరు-కడప సరిహద్దు మెట్ట ప్రాంత మండలమైన మర్రిపాడు మండలంలోని కంప సముద్రం గ్రామానికి చెందిన రచయిత్రి మొల్ల గారి 14వ సంతానమైన డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య చిన్నతనంలో ఉంటే విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటూ 13 డిగ్రీలు పట్టాలు పూర్తి చేశాడు.. అలాగే నాలుగు డాక్టరేట్ లు కూడా యూనివర్సిటీల ద్వారా అందుకున్నారు. అనంతరం నెల్లూరు సమీపంలోని పల్లిపాలెం డైట్ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. అనంతరం తన సహధర్మచారిని కూడా వృత్తిరీత్యా ప్రధానోపాధ్యారాలుగా అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.ఆమె ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె విధులు నిర్వహిస్తున్న చిలకలమర్రి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరి ఆ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పబ్లిక్ పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించడంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చాడు. అదే సమయంలో శాస్త్ర ఆధారిత గ్రంథాలు రాస్తూ వచ్చిన.. డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య రచించిన గ్రంథాలు... 1.మొల్ల రామాయణం అనువాదం.</p>
<p>(పద్యాలు వాటికి అర్థాలు, సారాంశం) 2.మొల్ల స్థానికత ఆధారాలు 3.మర్రిపాడు మండల చరిత్ర 4.అనంతసాగరం మండల చరిత్ర. 5.ఆత్మకూరు మండల చరిత్ర 6.ఉదయగిరి రాజ్య చరిత్ర 7. స్వర శాస్త్రం. 8.బద్వేలు రాజ్య చరిత్ర. 9.సిద్ధవటం రాజ్య చరిత్ర. 10.బ్రాహ్మ జ్ఞానోపాయం. తదితర గ్రంధాలు రచించడం కొనసాగిస్తూనే ఉన్నారు.</p>
<p>గడిచిన కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో దారంతో దేవత మూర్తుల కళారూపాలను తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ముందుగా శ్రీరామచంద్రమూర్తి కళారూపాన్ని దారంతో తయారు చేయడం ప్రారంభించారు ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య. ఆ సమయంలో పలు అవంతరాలు ఎదురై తను రూపొందిస్తున్న ఏకధారా కళా రూపానికి వాడిన పలు పదార్థాలు తను చేయి కాలి బొబ్బలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఇలా సరదాగా ప్రారంభించిన ఏకధార శిల్పకళా రూపాలు ఒక్కొక్కటిగా తయారు చేస్తూ ఇప్పటివరకు 3 వేల కళారూపాలను తయారు చేశాడు. అందులో దేవతామూర్తులు,రాజులు, రాజకీయ నాయకుల కళారూపాలు తయారు చేశారు. ఈ కళారూపాలు వెలుగులోకి రావడంతో గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రియాల్టీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఇలా పలు అవార్డులు అందుకున్నారు. అంతేకాక ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు. అంతటితో ఆగని ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య. ఇటీవల రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంది అవార్డుల ప్రధానోత్సవం లో కూడా నంది అవార్డు గెలుచుకున్నాడు. ఇన్ని అవార్డులు ఇన్ని రికార్డులు వచ్చిన ఉపాధ్యాయుడు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్యకు తనతోనే ఈ కళారూపాల నైపుణ్యం ఆగిపోకూడదని భావించి తన పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటుగా ఏకధార కళ రూపాల నైపుణ్యం నేర్పిస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్యను ఔరా బడిపంతులు మున్నెల్లి శివశంకరయ్య అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/nellore/the-master-of-ekadhara-string-art-and-world-record-holder-145108</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[Narsimha Reddy]]></dc:creator>
<pubDate>Wed, 08 Apr 2026 04:57:35 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/minister-narayanas-prati-gadapaku-arogya-bharosa-program-in-nellore-145086</link>
<title><![CDATA[Nellore: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ.. నెల్లూరులో ఆరోగ్య భరోసా జాతర]]></title>
<description><![CDATA[Nellore: నెల్లూరు 54వ డివిజన్ లో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 'ప్రతి గడపకు ఆరోగ్య భరోసా' కార్యక్రమం.]]></description>
<enclosure length="87964" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410844-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410844-nellore-.webp'/><figcaption><p>Nellore: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ.. నెల్లూరులో ఆరోగ్య భరోసా జాతర</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore:</b> నెల్లూరు 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంత్రి నారాయణ చేపట్టిన ‘ప్రతి గడపకు ఆరోగ్య భరోసా’ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైద్య బృందాలు మరియు నాయకులు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య అవగాహన కరపత్రాలను పంపిణీ చేయగా, అనంతరం నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 2,986 మందికి కంటి పరీక్షలు, 1,556 మందికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, 45 మందికి అత్యంత ఖరీదైన కంటి శస్త్రచికిత్సలు మరియు 1,600 మందికి పైగా దంత చికిత్సలను పూర్తి ఉచితంగా అందించారు. </p>
<p><b>ఈ సందర్భంగా నాయకులు మరియు వైద్యులు మాట్లాడుతూ.. </b></p>
<p>కేవలం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడే కాకుండా, నెల్లూరు నగరంలోని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా చేరువ చేయడమే లక్ష్యంగా మంత్రి నారాయణ ఈ నిరంతర కార్యక్రమాన్ని చేపట్టారని, అందుకే ఆయన ప్రజల పాలిట ‘ఆపద్బాంధవుడు’ అయ్యారని కొనియాడారు. సామాన్యుల ఆరోగ్యం కోసం నిరంతరాయంగా సాగుతున్న ఈ ఆరోగ్య విప్లవం నగరంలోని అన్ని డివిజన్లలో కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ ,ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుధ,వైద్య పరిపాలన పర్యవేక్షకులు A.G.M. శేఖర్ రెడ్డి, నాయకులు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ -కో ఆప్షన్ మెంబెర్ షేక్. జమీర్,ప్రెసిడెంట్- షాహిద్</p>
<p>కార్పొరేటర్ సఫియా ముజీర్,పార్లమెంట్ మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ జంషీద్, యూనిట్ ఇంచార్జి -ఖాదర్ బాషా,కో-యూనిట్ ఇంచార్జి- మునీర్,యూత్ ప్రెసిడెంట్ ముస్టాక్,బూత్ కన్వీనర్- హసీబ్, అస్లాం బూత్ లెవెల్ అసిస్టెంట్ ఇస్మాయిల్, ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దంతం రవణమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ- ఖాదర్ భాష,డివిజన్ యూత్ ప్రెసిడెంట్- ఖలీల్ డివిజన్ యూత్ -జనరల్ సెక్రటరీ - ఫైజు, ప్రభావితులు-మక్కే. శివప్రసాద్,సుభాని తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/minister-narayanas-prati-gadapaku-arogya-bharosa-program-in-nellore-145086</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[V. Narasimhulu, Nellore]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 16:20:58 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/vizag-collector-m-abhishekt-kishore-reviews-constituency-development-projects-145084</link>
<title><![CDATA[Vizag: డెడ్ లైన్ లోగా పనులు పూర్తి చేయాలి.. కలెక్టర్ వార్నింగ్]]></title>
<description><![CDATA[Vizag: విశాఖపట్నం జిల్లాలో నియోజకవర్గాల అభివృద్ధి పనులపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సమీక్ష.]]></description>
<enclosure length="57096" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410842-vizag-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410842-vizag-.webp'/><figcaption><p>Vizag: డెడ్ లైన్ లోగా పనులు పూర్తి చేయాలి.. కలెక్టర్ వార్నింగ్</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vizag:</b> విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు, తీసుకున్న చర్యలు, పెండింగ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని సూచించారు.</p>
<p>పెండింగ్ పనులను నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని, ప్రజలకు తక్షణమే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపో నిర్మాణం, మధురవాడలో పీహెచ్‌సీ భవన నిర్మాణం, భీమిలి బీచ్ రోడ్ సుందరీకరణ, రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. సెజ్ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలన్నారు.</p>
<p>ఆనందపురంలో కొత్త అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. శాటిలైట్ సిటీ పనులు, మధురవాడలో కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం, మత్స్యకారుల కోసం ల్యాండింగ్ సెంటర్లు, కొత్త కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల అమలులో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు, ఎస్‌ఎన్‌ఎల్ కాలువ పనులు చేయాలన్నారు. గోకుల్ పార్క్ అభివృద్ధి, పాత షాపింగ్ కాంప్లెక్స్ తొలగించి సర్వతి పార్క్ నిర్మాణం, టిడ్కో ఇళ్ల నిర్మాణం, </p>
<p>కేజీహెచ్ అభివృద్ధి పనులు, స్లమ్ పునరావాస కార్యక్రమాల అమలులో నాణ్యతను పాటించాలని సూచించారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలలో కూడా అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ముందడుగు వేయాలని సూచించారు. పెండింగ్ పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, విధాన పరమైన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. </p>
<p>వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఇంచార్జ్ ఆర్డిఓ శేష శైలజ, జీవీఎంసీ ఎడిసి సత్యవేణి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/vizag-collector-m-abhishekt-kishore-reviews-constituency-development-projects-145084</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[ANIL, VIZAG CITY]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 15:53:48 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/collector-t-nishanthi-reviews-sampoornata-abhiyan-20-in-paderu-145082</link>
<title><![CDATA[Paderu: గణాంకాలు కాదు.. పేదల జీవితాల్లో మార్పు రావాలి]]></title>
<description><![CDATA[Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధికి సంపూర్ణత అభియాన్ 2.0 ఒక దిక్సూచి అని కలెక్టర్ టి. నిశాంతి పేర్కొన్నారు.]]></description>
<enclosure length="172780" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410840-paderu-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410840-paderu-.webp'/><figcaption><p>Paderu: గణాంకాలు కాదు.. పేదల జీవితాల్లో మార్పు రావాలి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Paderu:</b> జిల్లా లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ (Aspirational District Programme) లో భాగంగా జిల్లాలో 'సంపూర్ణత అభియాన్ 2.0' సూచికలను (Indicators) వంద శాతం సాధించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎదురవుతున్న వివిధ సవాళ్లను అధిగమిస్తూ, సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి, విద్యా, వైద్య ఆరోగ్య, ప్రణాళిక, స్త్రీ శిశు సంక్షేమ, పశువర్ధక, డ్వామా,డి ఆర్ డి ఎ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆమె తన చాంబర్లో.</p>
<p><b> జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై, అలాగే</b></p>
<p>విద్య, వైద్యం,ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలను పెంచడం, (MMR -IMMR)మాతా-శిశు మరణాల రేటును తగ్గించి మెరుగైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని చూచించారు. ఉద్యోగ, స్వయం ఉపాధి, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ (Skill Development) అందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాడం,</p>
<p>పేదరిక నిర్మూలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూడటం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా, తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.</p>
<p>"జిల్లా అభివృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావాలి. 'సంపూర్ణత అభియాన్ 2.0' లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలి. నిర్దేశించిన గడువులోగా అన్ని సూచికలలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే మన లక్ష్యం గా పనిచేయ్యిలి.</p>
<p>ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి జాయింట్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమాని శ్రీపూజ, ఐసిడిఎస్ పీడీ ఝాన్సీరామ్ పాడల్ , డిఇఓ కృష్ణారావు, సీపీవో ప్రసాదరావు , డిఏం హెచ్ఓ డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ , పిడి డ్వామ విద్యాసాగర్, పి డి ఆర్ డి ఏ వి మురళి,ఏడి ఏం హెచ్ ఓ డాక్టర్ ప్రతాప్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>
<p>జారీ :-జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ,ఏ ఎస్ ఏర్ జిల్లా (పాడేరు).</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/collector-t-nishanthi-reviews-sampoornata-abhiyan-20-in-paderu-145082</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[ANIL, VIZAG CITY]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 15:39:23 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/vizag-cp-shankhabrata-bagchi-ips-holds-coordination-meeting-with-ncb-145081</link>
<title><![CDATA[Vizag: మాదకద్రవ్యాల రహిత నగరమే లక్ష్యం.. ఎన్సీబీ అధికారులతో సీపీ బాగ్చి భేటీ]]></title>
<description><![CDATA[Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ నిర్మూలనకు నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రాత బాగ్చి మరియు ఎన్సీబీ అధికారుల కీలక సమావేశం.]]></description>
<enclosure length="157399" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410839-vizag-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410839-vizag-.webp'/><figcaption><p>Vizag: మాదకద్రవ్యాల రహిత నగరమే లక్ష్యం.. ఎన్సీబీ అధికారులతో సీపీ బాగ్చి భేటీ</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Vizag: </b>విశాఖ నగరంలో డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులతో కలిసి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగినది.</p>
<p>ఈ రోజు సాయంత్రం నగర పోలీసు కమిషనర్ గారి కాన్ఫరెన్స్ హాల్ నందు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB)కు చెందిన అధికారులు మరియు వారి సిబ్బంది, నగర పోలీసు అధికారులు పాల్గొన్న ఈ కో-ఆర్డినేషన్ మీటింగ్ నందు సింతటిక్ డ్రగ్స్, సెమీ సింతటిక్ డ్రగ్స్ యొక్క కింగ్ పిన్స్ అరెస్టుల పై, వాటి ప్రధాన మూలాల గుర్తింపులపై పలు చర్చలు జరిపి, ఉమ్మడిగా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగినది.</p>
<p>ఈ కార్యక్రమంలో సిపి గారితో పాటుగా నార్కోటిక్ కంట్రోల్ అధికారులు, నగర డి.సి.పి-01, డి.సి.పి-02, ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, సీఐ లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/vizag-cp-shankhabrata-bagchi-ips-holds-coordination-meeting-with-ncb-145081</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[ANIL, VIZAG CITY]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 15:30:48 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/kotamreddy-giridhar-reddy-distributes-cmrf-checks-in-nellore-rural-145078</link>
<title><![CDATA[Nellore: సీఎం సహాయ నిధి అంటే పేదల సంజీవని.. గిరిధర్ రెడ్డి]]></title>
<description><![CDATA[Nellore: నెల్లూరు రూరల్ లో 28 మందికి 8 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.]]></description>
<enclosure length="73848" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410836-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410836-nellore-.webp'/><figcaption><p>Nellore: సీఎం సహాయ నిధి అంటే పేదల సంజీవని.. గిరిధర్ రెడ్డి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore: </b>నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 28 మందికి 8 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. </p>
<p><b>ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..</b></p>
<p>ముఖ్యమంత్రి సహాయనిధి పేదలపాలిట సంజీవని అని, పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చెప్పారు..అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తోందని చెప్పారు. దరఖాస్తు చేసుకొన్న అర్హులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 503 మందికి 4 కోట్ల 53లక్షల రూపాయల చెక్కులు అందజేశామని చెప్పారు.</p>
<p> పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మాటమీద నిలబడే ప్రభుత్వం తమదని.. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలియజేశారు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘల అధ్యక్షులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/kotamreddy-giridhar-reddy-distributes-cmrf-checks-in-nellore-rural-145078</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[V. Narasimhulu, Nellore]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 15:08:18 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/excise-department-raids-on-andhra-odisha-border-145077</link>
<title><![CDATA[Parvathipuram: సారా తయారీదారులకు చుక్కలు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి]]></title>
<description><![CDATA[Parvathipuram: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు గ్రామాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు. 26 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.]]></description>
<enclosure length="137156" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410835-parvathipuram-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410835-parvathipuram-.webp'/><figcaption><p>Parvathipuram: సారా తయారీదారులకు చుక్కలు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Parvathipuram:</b> నవోదయం 2.0 కార్యక్రమంలో అమలు లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ బి.శ్రీనాథుడు ఆదేశములు మేరకు ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దులో గల నాటు సారా తయారీ స్థావరాలు కలిగిన సందుబడి గ్రామంలో ఆంధ్ర ఎక్సైజ్ శాఖ, ఒడిస్సా ఎక్సైజ్ శాఖ తో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 26,000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసారు. </p>
<p>రవాణా కు సిద్ధంగా ఉంచిన 420 లీటర్ల నాటు సారాను , 50 కేజీలు అమ్మోనియా ను స్వాధీనం చేసుకునీ వాటితో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒడిస్సా ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో కురుపాం ఎక్సైజ్ సిబ్బంది, పార్వతీపురం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ పాలకొండ, సీతానగరం, రాజాం, చీపురుపల్లి, ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది, విజయనగరం ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.</p>
<p>అలానే నాటు సారా పై సరిహద్దులో నిరంతర నిఘా పెడుతున్నామని , ఈ క్రమంలో ప్రజలు నాటు సారా తయారీ - రవాణా - అమ్మకాలు చేసే వారిపై ఫిర్యాదులు 6302936599 ఫోన్ నెంబర్ కు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కురుపాం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/excise-department-raids-on-andhra-odisha-border-145077</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,శ్రీకాకుళం]]></category>
<dc:creator><![CDATA[V.SESHU	, KURUPAM]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 15:00:44 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/mp-bk-parthasarathi-attends-101st-annual-brahmotsavam-in-gudipalli-145076</link>
<title><![CDATA[Gudipalli: రంగనాథుని సన్నిధిలో ఎంపీ బీకే పార్థసారథి.. బ్రహ్మోత్సవాల సందడి!]]></title>
<description><![CDATA[Gudipalli: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి.]]></description>
<enclosure length="93520" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410834-gudipalli-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410834-gudipalli-.webp'/><figcaption><p>Gudipalli: రంగనాథుని సన్నిధిలో ఎంపీ బీకే పార్థసారథి.. బ్రహ్మోత్సవాల సందడి!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Gudipalli:</b> శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి వారి 101వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.</p>
<p>ఈ కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు జరిపి తీర్థప్రసాదాలను అందించారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై స్థానిక నాయకులతో చర్చించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/mp-bk-parthasarathi-attends-101st-annual-brahmotsavam-in-gudipalli-145076</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,అనంతపురం]]></category>
<dc:creator><![CDATA[హెచ్ఎం డిజిటల్ డెస్క్]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 14:48:44 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/nellore-collector-himanshu-shukla-issues-summer-action-plan-145075</link>
<title><![CDATA[Nellore: ఎండలు ముదురుతున్నాయి.. సిద్ధంగా ఉండండి]]></title>
<description><![CDATA[Nellore: నెల్లూరు జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సమ్మర్ యాక్షన్ ప్లాన్.]]></description>
<enclosure length="26356" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410833-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410833-nellore-.webp'/><figcaption><p>Nellore: ఎండలు ముదురుతున్నాయి.. సిద్ధంగా ఉండండి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore:</b> రానున్న మూడు నెలల్లో వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. </p>
<p><b>ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..</b></p>
<p>రానున్న మే జూన్ జూలై నెలల్లో వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో చేతి పంపులన్నీ సక్రమంగా పనిచేసేలా, ఓవర్ హెడ్ ట్యాంకులు, తాగునీటి పథకాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. </p>
<p>పశువులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తయిన యానిమల్ హాస్టల్స్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి సాగునీటి కాలువలకు ఎంత మేర రైతులకు అవసరమో అంతమేర మాత్రమే విడుదల చేయాలన్నారు. సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించి నీరు వృధా కాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.</p>
<p>వేసవిలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా బస్‌స్టేషన్లు, జనసంచారం ఉన్న కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ఎక్కువ నీరు తాగేలా చూడాలన్నారు. </p>
<p> మున్సిపాలిటీ కేంద్రాల్లో స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో చలివేంద్రాలు, మజ్జిగ, షర్బత్, నిమ్మకాయ సోడా, చల్లని పానీయాలు ప్రజలకు అందించేందుకు ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50,000 నగదు బహుమతిని అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. </p>
<p>ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, డ్వామా పిడి గంగాభవాని, వ్యవసాయాధికారి సత్యవాణి, సోమశిల ఎస్ఈ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/nellore-collector-himanshu-shukla-issues-summer-action-plan-145075</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[V. Narasimhulu, Nellore]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 14:30:15 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/kotamreddy-srinivasulu-reddy-reviews-lrs-progress-in-nellore-district-145073</link>
<title><![CDATA[Nellore: నుడా చైర్మన్ సీరియస్.. ఎల్ఆర్ఎస్ పనుల్లో జాప్యం వద్దు!]]></title>
<description><![CDATA[Nellore: నెల్లూరు జిల్లాలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విజయవంతానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కీలక సమావేశం.]]></description>
<enclosure length="215251" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410831-nellore-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410831-nellore-.webp'/><figcaption><p>Nellore: నుడా చైర్మన్ సీరియస్.. ఎల్ఆర్ఎస్ పనుల్లో జాప్యం వద్దు!</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Nellore:</b> ప్రతి ఒక్కరు LRS ను సీరియస్ గా తీసుకోవాలన్నారు నుడా చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.</p>
<p><b>ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..</b></p>
<p>ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. అక్రమ లే అవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇదో మంచి అవకాశం అన్నారు. నెల్లూరు కందుకూరు ఆత్మకూరు కావలి మున్సిపల్ కమీషనర్లతో కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. </p>
<p>వైస్ చైర్మన్ మొగలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ మాట్లాడారు.. ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించేందుకు, దాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలన్నారు.. వార్డ్ ప్లానింగ్ అధికారులు కొత్తగా ఉండడంతో కొంతమేర జాప్యం జరుగుతోందని, తన దృష్టికి వచ్చిందని చెప్పారు.</p>
<p> మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కమీషనర్ లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తామని. LRS ను విజయవంతంగా నిర్వహించాలని కోటంరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఈ పథకాన్ని విజయవంతం చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లతో పాటు నుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/kotamreddy-srinivasulu-reddy-reviews-lrs-progress-in-nellore-district-145073</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[V. Narasimhulu, Nellore]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 14:14:27 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/natural-farming-awareness-in-palavalasa-sompeta-145070</link>
<title><![CDATA[Sompeta: ఆరు నెలల నిల్వ.. అద్భుతమైన దిగుబడి]]></title>
<description><![CDATA[Sompeta: సోంపేట మండలం పాలవలసలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన. ఘనజీవామృతం ప్రయోజనాలపై అధికారుల వివరణ.]]></description>
<enclosure length="264668" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410828-sompeta-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410828-sompeta-.webp'/><figcaption><p>Sompeta: ఆరు నెలల నిల్వ.. అద్భుతమైన దిగుబడి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Sompeta:</b> సోంపేట మండలం పాలవలసలో ప్రకృతి వ్యవసాయ అధికారి, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన కల్పించారు. 300 కిలోల నాణ్యమైన ఘన జీవామృతం తయారు చేసి దాని ప్రాముఖ్యత, వినియోగం, ప్రయోజనాలను వివరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే సుస్థిర సాగు విధానమని తెలిపారు. </p>
<p>రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే ఘనజీవామృతంతో పంటలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని అన్నారు. ఒక ఎకరాకు సుమారు 400 కిలోల ఘనజీవామృతం పొడి వినియోగిస్తే యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువుల అవసరం లేకుండా పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, ఇది నేలలో సూక్ష్మజీవుల వృద్ధిని పెంచి భూసారాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.</p>
<p> దీని వినియోగంతో పంటల వేరుశాతం బలపడటంతో పాటు దిగుబడి నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు. అదేవిధంగా ఘనజీవామృతం నిల్వ సామర్థ్యం సుమారు ఆరు నెలల వరకు ఉంటుందని, ముందుగానే తయారు చేసుకుని అవసరానికి అనుగుణంగా రైతులు వినియోగించుకోవచ్చని సూచించారు. రసాయన సాగుతో పోలిస్తే ప్రకృతి సాగు పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు.</p>
<p>ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులకు ఘనజీవామృతం తయారీ విధానం, నిల్వ పద్ధతులు, ఎకరానికి అవసరమైన మోతాదు, వాడే సమయం వంటి అంశాలపై ప్రాయోగికంగా వివరించారు. గ్రామ రైతులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏ, ప్రకృతి వ్యవసాయ శిబ్బంది, ఐసీఆర్పీ తిరుమల, స్వాతి, శ్రావణి, మహేష్, జయలక్ష్మి, హైమావతి, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/natural-farming-awareness-in-palavalasa-sompeta-145070</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,శ్రీకాకుళం]]></category>
<dc:creator><![CDATA[G.RAMBABU, SOMPET]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 13:51:25 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/somireddy-chandramohan-revive-ntr-sujala-sravanthi-scheme-in-podalakur-145067</link>
<title><![CDATA[Podalakur: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి]]></title>
<description><![CDATA[Podalakur: పొదలకూరులో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించనున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.]]></description>
<enclosure length="60348" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410825-podalakur-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410825-podalakur-.webp'/><figcaption><p>Podalakur: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Podalakur:</b> శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసిపి ప్రభుత్వం మూత వేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు 20 లీటర్లు మినరల్ వాటర్ క్యాన్ రెండు రూపాయలకే ఇచ్చేలా 2019లో తెలుగుదేశం ప్రభుత్వం రూ. 4కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిరుపయోగంగా వదిలేసింది.</p>
<p>తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు సోమిరెడ్డి అదాని కృష్ణపట్నం పోర్టు సి ఎస్ ఆర్ నిధులతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేలా వారితో మాట్లాడి ఒప్పించారు. దీంతో అదాని కృష్ణపట్నం పోర్ట్ ప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ పథకాన్ని పరిశీలించి తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.</p>
<p> అలాగే పొదలకూరులో నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియాన్ని పరిశీలించిన సోమిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేడియం లోని జంగిల్ క్లియరెన్స్ చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ క్రీడ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులన్నిటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/somireddy-chandramohan-revive-ntr-sujala-sravanthi-scheme-in-podalakur-145067</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,నెల్లూరు]]></category>
<dc:creator><![CDATA[హెచ్ఎం డిజిటల్ డెస్క్]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 13:24:15 GMT</pubDate>
</item>
<item>
<link>https://www.hmtvlive.com/telugu-news/andhra/unexpected-hailstorm-hits-tummapala-in-anakapalli-district-145065</link>
<title><![CDATA[Anakapalli: ఉక్కపోతకు చెక్.. అనకాపల్లిని ముంచెత్తిన భారీ వర్షం]]></title>
<description><![CDATA[Anakapalli: అనకాపల్లి జిల్లాలో అకాల వర్షం. తుమ్మపాల గ్రామంలో భారీగా కురిసిన వడగళ్ల వాన.]]></description>
<enclosure length="91533" type="image/webp" url="https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410823-anakapalli-.webp"/>
<content:encoded><![CDATA[<figure> <img width='1500' height='900' src='https://assets.hmtvlive.com/h-upload/2026/04/07/410823-anakapalli-.webp'/><figcaption><p>Anakapalli: ఉక్కపోతకు చెక్.. అనకాపల్లిని ముంచెత్తిన భారీ వర్షం</p><span class='copyright'></span></figcaption></figure><p><b>Anakapalli:</b> అనకాపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వరుణ దేవుడు చల్లటి కబురు అందించాడు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, ఈ వర్షంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తుమ్మపాల గ్రామం గురించి.. అక్కడ ఏకంగా భారీ వడగళ్ల వాన కురవడం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.</p>
<p>​ఉదయం వరకు సాధారణంగానే ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయానికి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రారంభమైన చిరుజల్లులు.. చూస్తుండగానే కుండపోత వర్షంగా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు, పల్లెల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ అకాల వర్షంతో ఉక్కపోత, ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.</p>
<p>​తుమ్మపాలలో వడగళ్ల వాన సందడి. జిల్లా అంతటా సాధారణ వర్షం కురిస్తే, తుమ్మపాల గ్రామంలో మాత్రం ఆకాశం నుంచి మంచు గడ్డలు రాలాయి. గ్రామంలో భారీగా వడగళ్ల వాన కురవడంతో ఒక్కసారిగా వాతావరణం కశ్మీర్‌ను తలపించింది.</p>]]></content:encoded>
<guid isPermaLink="true">https://www.hmtvlive.com/telugu-news/andhra/unexpected-hailstorm-hits-tummapala-in-anakapalli-district-145065</guid>
<category><![CDATA[ఆంధ్రప్రదేశ్,తాజా వార్తలు,Breaking,విశాఖపట్నం]]></category>
<dc:creator><![CDATA[NAGA SRINIVASARAO,	ANAKAPALLI]]></dc:creator>
<pubDate>Tue, 07 Apr 2026 13:04:33 GMT</pubDate>
</item>
</channel>
</rss>
