భారీగా తగ్గిన శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ ధరలు

భారీగా తగ్గిన శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ ధరలు
x
Highlights

స్మార్ట ఫోన్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ మంచి ఆఫర్ ను అందిస్తుంది.

స్మార్ట ఫోన్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ మంచి ఆఫర్ ను అందిస్తుంది. సౌత్ కొరియాకు చెందిన ఈ సంస్థ ఇటీవలే మార్కెట్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఆ ఫోన్ ల ధర భారీగా ఉండడంతో కస్టమర్లకు అందుబాటులో ఉండేందుకు ఇప్పడు వాటి ధరలను తగ్గించింది. ఏ30ఎస్ 4జీబీ/64 జీబీ వేరియంట్‌ గల స్మార్ట ఫోన్ కు వెయ్యి రూపాయలు తగ్గించింది. దీంతో ఈ ఫోన్ ధర ఇప్పుడు మార్కెట్ లో కేవలం రూ.15,999కే లభించనుంది.

ఇక ఏ50ఎస్ 4జీబీ/128జీబీ వేరియంట్‌ గల ఫోన్ విషయానికొస్తే దీని ధర రూ.22,999 ఇండగా దీనికి ఏకంగా 3వేల రూపాయలు తగ్గించింది. ఇక ఇప్పుడు ఈ ఫోన్ మార్కెట్లో కేవలం రూ.19,999కే లభించనుంది. ఈ మోడల్ లోనే 6జీబీ/128జీబీ వేరియంట్‌ గల ఫోన్ ధర తగ్గించిన తరువాత మార్కెట్లో కేవలం రూ.21,999కే దొరుకుతుంది. ఇక ఈ ఫోన్లను మీ సొంతం చేసుకోవాలనుకుంటే శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు, అమెజాన్‌ వెబ్‌సైట్లలో కూడా తీసుకోవచ్చు. ఈ ధరలు కేవలం ఇప్పటి వరకూ మాత్రమే కాదండీ శాశ్వతంగా తగ్గించామని శాంసంగ్‌ సంస్థ తెలియజేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోన్ ను ఇప్పుడే మీ సొంతం చేసుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories