జియో దెబ్బకు గింగిరాలు

జియో దెబ్బకు గింగిరాలు
x
Highlights

భారతీయ టెలికాం దిగ్గజం జియో ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన వృద్ధిని కనబర్చింది....

భారతీయ టెలికాం దిగ్గజం జియో ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన వృద్ధిని కనబర్చింది. గతేడాది 16 కోట్లుగా ఉన్న జియో సబ్‌స్క్రైబర్ల బేస్ ఈఏడాది అది 28 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా కొత్తగా 2.8 కోట్ల సబ్‌స్క్రైబర్లు గత క్వార్టర్లో వచ్చి చేరారు. గత నెలలో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 65 శాతం

గతం కంటే పెరిగి రూ.831 కోట్లకు చేరింది. ఇది ఇతర టెలికాం సంస్థలకు రుచించడం లేదు. త్వరలోనే తమ మెయిన్ కాంపిటీటర్లందరినీ దాటిపోతామని.. జియో 5జీ కూడా రెడీగా ఉందని ముకేష్ అంబానీ ఇటీవల స్పష్టం చేశారు. దీంతో దిగ్గజ టెలికాం సంస్థలకు ముప్పు పొంచి ఉందని ముకేశ్ అంబానీ చెప్పకనే చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories