బాబు తన అనుభవంతో రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మించారు: విజయసాయిరెడ్డి

బాబు తన అనుభవంతో రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మించారు: విజయసాయిరెడ్డి
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమం...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమం సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ ట్వీట్లు చేశారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రులు పాల్గొనడం అరుదైన దృశ్యమని అభివర్ణించిన విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం గల వ్యక్తి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ విద్వేశాలను ధ్వంసం చేసి స్నేహ వారధులు తెరిచారని విజయసాయి రెడ్డి అన్నారు. పదేళ్ల తర్వాత క్రిష్ణా డ్యాములన్నీ నిండాయని విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories