వడ్డీలకే 20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది: మిథున్‌రెడ్డి

వడ్డీలకే 20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది: మిథున్‌రెడ్డి
x
Highlights

లోక్‌సభలో వైసీపీ ఎంపీలు తమ వాణి గట్టిగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్...

లోక్‌సభలో వైసీపీ ఎంపీలు తమ వాణి గట్టిగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోందని వివరించారు. వడ్డీలకే 20వేలకోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు చెల్లించాడానికే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితిని ఏపీ ఎదుర్కొంటుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories