వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి కరోనా పరీక్ష..

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి కరోనా పరీక్ష..
x
MP gorantla madhav(File photo)
Highlights

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కేసులు నమోదు అయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో కూడా కరోనా కేసులు 50 దాటాయి. ఈ నేపథ్యంలో హిందూపురం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ శనివారం కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అనైతికమని, ప్రజలను అభద్రతా భావానికి గురిచేసేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రాణాలను లెక్క చేయకుండా రెడ్‌ జోన్లలో పర్యటిస్తున్నారని, కానీ టీడీపీ నేతలు మాత్రం ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేయడం సరైనది కాదని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories